అద్దె ఇంటి కోసం అన్ని లక్షలా..? విరుష్క దంపతుల ఖర్చుకు షాక్ అవుతున్న ఫ్యాన్స్, ఆ ఇంట్లో అంత స్పెషల్ ఏంటీ..?

First Published Nov 25, 2022, 5:50 PM IST

బాలీవుడ్ లో స్టార్స్ లగ్జరీ లైఫ్ కోసం.. కోట్లలో ఖర్చు పెడుతుంటారు. ఇళ్లు ఆస్తులు కొనడంలో ముందుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేసే పనులు అభిమానులకు షాక్ ఇచ్చేవిగా ఉంటాయి రీసెంట్ గా  హీరోయిన్ అనుష్క శర్మ - స్టార్ క్రికెటర్ విరాట కోహ్లీ అద్దె ఇంటి కోసం పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో  అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ముందువరసులో ఉంటారు. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు.. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి తరువాత గ్యాప్ తీసుకోకుండా.. వెంటనే ఒ కూతురిని కూడా కనేశారు  ఈ స్టార్ కపుల్స్. ఇద్దరు స్టార్లే కాబట్టి లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు. 

virat kohli and anushka sharma in kitchen viral

ఇక ఎక్కడెక్కడో ఆస్తులు కూడా కొంటున్నారట ఈ జంట. కాని సొంత ఇంట్లో మాత్రం ఉండకుండా.. అద్దె ప్లాట్ లో  ఉంటున్నారట. ఈ అద్దె ప్లాట్ కోసం నెలకు ఏకంగా 3 లక్షల వరకూ చెల్లిస్తున్నారట జంట. అంతే కాదు ఈ ఇంటికోసం దాదాపు 8 లక్షల వరకూ డిపాజిట్ కూడా చెల్లించారని సమాచారం. 
 

ముంబయి జుహూ ప్రాంతంలో ఉన్న ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో కాపురంపెట్టిన ఈ కపుల్స్.. ప్లాట్ కోసం అద్దెగా 3 లక్షలు చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది. కోట్ల ఆస్తులు ఉండి.. సొంత ఇళ్ళు ఉండి  అద్దెకు ఉంటున్నారేంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతే కాదు ఆ ప్లాట్ అంత స్పెషలె ఏముంది అంటున్నారు. 
 

అయితే ఈ ప్లాట్ వారికి చాలా స్పెషల్ అని తెలుస్తోంది.  సముద్రానికి ఎదురుగా  ఉండటంతో మంచి వ్యూ తో పాటు వాస్తు కూడా ఉందట. ప్రశాంతమైన వాతావరణంతో పాటు బాల్కనీ నుంచి సముద్ర అందాలు చూసేలా ఉండటంతో కోరి ఈ ప్లాట్ లోకి దిగినట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ఉంటున్న ఆ లగ్జరీ అపార్ట్మెంట్ వడోదర రాజ కుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ కు చెందినదిగా తెలుస్తోంది.
 

Image: Anushka SharmaInstagram

మరోవైపు విరుష్క జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలీబాగ్‌లోని జిరాద్‌ గ్రామ శివారులో రూ 19.24 కోట్లతో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌కూడా అయినట్లుగా సమాచారం.

దాదాపు మూడునాలుగేళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్కశర్మ ప్రస్తుతం చక్‌దే ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో నటిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ  సినిమా తెరకెక్కుతోంది. అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్‌ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీ కి ప్రాసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

click me!