'మహారాజా' తర్వాత విజయ్ సేతుపతి నటించిన `సార్ మేడ్`('తలైవాన్ తలైవి) చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సార్ మేడమ్`. తమిళంలో ఇది `తలైవాన్ తలైవి`గా రూపొందగా, తెలుగులో `సార్ మేడమ్` పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రంలో యోగి బాబు, రోషిణి హరిప్రియ, దీపా శంకర్, మైనా నందిని, కాళీ వెంకట్ వంటి అనేక మంది ప్రముఖ నటులు నటించారు.