విజయ్ వీడ్కోలు కార్యక్రమానికి భారీగా సెలబ్రిటీలు
విజయ్ చివరి సినిమా కావడంతో, ఆడియో లాంచ్ ని ఫేర్వెల్ ఫంక్షన్ లా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ఈ వెంట్ కు భారీ ఎత్తున సెలబ్రిటీలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ వంటి స్టార్స్ ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. రజనీ, కమల్ రావడం కష్టమే. అజిత్ కూడా తన సినిమా ఫంక్షన్స్ కే రాడు. సూర్య, సింబు వంటి వారు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్లంతా వస్తే జననాయకన్ ఆడియో లాంచ్ టాలీవుడ్ లో ఒక గొప్ప ఈవెంట్ అవుతుంది.