#Kalki2898AD:'కల్కి' లో విజయ్ దేవరకొండ పాత్ర ఇదా,షాకింగ్ డిటేల్స్

First Published Jun 11, 2024, 4:12 PM IST

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది. 

vijay Devarakonda


ఇప్పుడు అందరి దృష్టీ కల్కి సినిమాపైనే. కల్కి 2898 AD’ కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. అతి తక్కువ సినిమాలతోనే అతి పెద్ద స్టార్ డైరక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు  సినిమాపై ఉన్న అంచనాలు.. నిన్న మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయనటంలో సందేహం లేదు.  

Vijay Devarakonda


 ‘ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమి పై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది’ అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు.ట్రైలర్ చూసిన వారంతా వావ్ అనే ఒకే ఒక పదం వాడుతున్నారు. టిక్కెట్ బుక్కింగ్స్ ప్రారంభమైన ఓవర్ సీస్ లో టిక్కెట్ సేల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక 40 శాతం పెరిగాయని తెలుసింది. ఈ క్రమంలో ఈ సినిమాని గురించిన ప్రతీ అంశం ఆసక్తికరమే. 

Vijay Devarakonda


ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్‌ని కంపోజ్ చేశారని ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ గెస్ట్  పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం కేవలం క్యామియో రోల్ కాదని తెలుస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.


అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు అర్జున. ఇది ఫుల్ లెంగ్త్ పాత్ర అని తెలుస్తోంది. ఇది  మహాభారతంలో అర్జునుడు పాత్రను గుర్తు చేస్తుందని చెప్తున్నారు. సినిమాలో ఇదొక కీలకమైన క్యారక్టర్ అని సస్పెన్స్ గా ఉంచి రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది.  కథలో భాగంగా ప్రభాస్ కు సపోర్ట్ గా నిలిచే పాత్ర ఇదిని అంటున్నారు. అశ్వద్దామ పాత్రకు అర్జున పాత్రకు మధ్య కొన్ని సీన్స్ కూడా ఉండబోతున్నాయట. 
 


ట్రైలర్‌లోనే దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వథామ)తో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్నపిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. 
 


కల్కిని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్‌ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ప్రభాస్, అమితాబ్ , దీపికా పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మాములు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం భారీగా ఖర్చు చేశారు.

kalki 2898 ad


ప్రముఖ నిర్మాత అశ్వనీదత్  నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం మొదలై రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. మరో ప్రక్క చిత్రం టీమ్ ప్రమోషన్స్ బిజీలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంభందించిన మెగా ఈవెంట్ ని అశ్వనీదత్ ప్లాన్ చేసినట్లు సమాచారం.  


నాగ్ అశ్విన్  మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 

ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు.  

Latest Videos

click me!