అల్లు అర్జున్‌ జాతకంలో దోషం ఉందా? మళ్లీ కాకరేపుతున్న వేణు స్వామి వ్యాఖ్యలు

Published : Dec 25, 2024, 10:59 PM ISTUpdated : Dec 25, 2024, 11:05 PM IST

అల్లు అర్జున్‌ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. అల్లు అర్జున్‌ జాతకం గురించి షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  

PREV
15
అల్లు అర్జున్‌ జాతకంలో దోషం ఉందా? మళ్లీ కాకరేపుతున్న వేణు స్వామి వ్యాఖ్యలు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలిచారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఫేమస్‌ అయ్యారు. అంతేకాదు హీరోయిన్ల దోషాలు పోవడం కోసం పూజలు కూడా నిర్వహించారు. 
 

25

ఈ క్రమంలో నాగచైతన్య,శోభితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. వాళ్లు కూడా కలిసి ఉండరని కామెంట్‌ చేయడం సంచలనంగా మారింది. ఈక్రమంలో ఆయన కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. కోర్ట్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్‌ పూర్తయ్యింది. ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చాడు. మళ్లీ యాక్టివ్‌గా మారాడు వేణుస్వామి. నెమ్మదిగా సోషల్‌ మీడియా ద్వారా జాతకాల దందా మళ్లీ స్టార్ట్ చేశారు. 
 

35

ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో, ముఖ్యంగా తెలంగాణలో అల్లు అర్జున్‌ వివాదం సంచలనంగా మారింది. బన్నీ నటించిన `పుష్ప 2` సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం శ్రీతేజని పరామర్శించిన వేణు స్వామి తనవంతుగా రెండు లక్షలు ఆర్థికసాయం అందించారు. 
 

45

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ జాతకం ప్రకారమే ఇలా జరుగుతుందన్నారు. అల్లు అర్జున్‌ జాతకం ఇప్పుడు బాగా లేదని తెలిపారు. ఆయన జాతకంలో దోషం ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. అల్లు అర్జున్‌ జాతకరీత్యా ఇదంతా జరుగుతుంది, ఎవరికైనా జాతకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. మార్చి 29 వరకు అల్లు అర్జున్‌ కి అంత బాగా లేదు, ఆ తర్వాత బాగుంటుందన్నారు. 
 

55

అంతేకాదు శ్రీతేజ్‌ ఫ్యామిలీ గురించి కూడా చెబుతూ, అతనికి అపముక్తి దోషం ఉన్నట్టు చెప్పాడు. అతని కోసం తనే స్వయంగా మృత్యుంజయ హోమం చేయిస్తానని వెల్లడించారు. మూడు రోజులపాటు ఈ హోమం ఉంటుందన్నారు. ఆ కుటుంబంలో ఒక పాప కూడా ఉంది. బాబు ఇప్పుడు 90శాతం కోలుకున్నాడని, నా తరఫున రెండు లక్షలు వారి ఫ్యామిలీకి అందిస్తున్నా అని చెప్పాడు వేణు స్వామి.

ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. చూడబోతుంటే వేణు స్వామి తన క్రెడిబులిటీని మళ్లీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. మరి ఇకపై ఆయనకు ఎలాంటి ఆదరణ ఉంటుందో చూడాలి. 

read more: జైలు నుంచి బయటకు వచ్చాక అల్లు అర్జున్‌ని కలిశారా? జానీ మాస్టర్‌ రియాక్షన్‌ ఇదే

also read: లవర్‌ని కలిసిన నిఖిల్‌, మాట తప్పడంతో ముఖం చూపించలేక తంటాలు, శ్రీముఖి అగ్గిరాజేసిందా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories