చిరంజీవి హీరోగా, వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్ లో మెరిసిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. వీరితోపాటు సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, హర్ష వర్థన్, అభినవ్ గోమటం, కేథరిన్ థ్రేస్సా, బుల్లిరాజు(రేవంత్), ఊహా, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది రెండు వందల కోట్లు దాటిందని టీమ్ పోస్టర్లు విడుదల చేయడం విశేషం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.