విక్టరీ వెంకటేష్, సౌందర్య టాలీవుడ్లో సూపర్ హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరు జంటగా ఏకంగా ఆరు సినిమాలు వచ్చాయి. ఆరూ మంచి విజయాలు సాధించాయి. ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్ గానూ నిలిచింది. ఈ ఇద్దరు కలిసి `పవిత్ర బంధం`, `పెళ్లిచేసుకుందాం`, `దేవి పుత్రుడు`, `రాజా`, `జయం మనదేరా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` వంటి సినిమాలు చేశారు. అయితే వీరి కాంబోలో మరో సినిమా కూడా రావాల్సింది. కానీ క్యాన్సిల్ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటి? ఆగిపోవడానికి కారణమేంటి? అనేది చూస్తే.