Ennenno Janmala Bandham: కేసు వాపసు తీసుకున్న వేద.. షాక్ లో యష్, మాళవిక?

First Published Dec 7, 2022, 12:05 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో వేద, ఆదిత్య కార్ కీస్ ఇలా ఇవ్వు చిన్న పిల్లలు కార్ డ్రైవ్ చేయకూడదు అనడంతో వెంటనే ఆదిత్య నేను ఇవ్వను మా ఫ్రెండ్స్ ముందు కార్ డ్రైవ్ చేయాలి అని మొండి పట్టి పడతాడు. అప్పుడు ఆదిత్య చెంప చెల్లుమనిపిస్తుంది వేద. అప్పుడు ఆదిత్య నన్నే కొడతారా మా మమ్మీకి చెబుతాను ఉండు అని అక్కడ నుంచి పరిగెడతాడు. ఇంతలో కార్ డ్రైవర్ ఎక్కడికి రావడంతో అడగ్గానే అలా కార్ కీస్ ఇచ్చేయడమేనా ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి అని అనగా ఇప్పుడు మీరు కొట్టిన దెబ్బ వాళ్ళ అమ్మ ఎప్పుడో కొట్టి ఉంటే ఈ పిల్లాడు ప్రవర్తించేవాడు కాదు మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగేది కాదు అనడంతో వేద షాక్ అవుతుంది.
 

 మీరు అనుకుంటున్నట్లుగా మాళవిక కాదు అమ్మ ఆక్సిడెంట్ చేసింది ఆదిత్య అనడంతో వేద షాక్ అవుతుంది. మరొకవైపు సులోచన మాలిని వాళ్ళు వేద కోసం కోర్టు దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో లాయర్ ఝాన్సీ అక్కడికి వచ్చి వేద కోర్టుకు రాగానే నన్ను కలవమని చెప్పండి తనకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సులోచన దేవుడా నాకు ఏంటి ఈ పరీక్ష ఒక వైపు అల్లుడు మరొకవైపు కూతురు ఇద్దరిలో ఎవరు ఓడిపోయిన జీవితంలో ఓడిపోతారు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సులోచన నేను లాయర్ పరమేశ్వర్ తో కొంచెం మాట్లాడాలి అక్కడికి పిలుచుకొని వెళ్తావా అనడంతో వెంటనే చిత్ర అక్కకు తెలిస్తే బాధపడుతుంది పెద్దమ్మ.
 

మీ అక్క బాధపడకుండా ఉండాలని వెళ్తున్నాను అని అనడంతో మాలిని అక్కడికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు సులోచన లాయరు గారు మీరు పెద్దమనసు చేసుకొని ఒక హెల్ప్ చేయాలి వెంటనే ఈ కేసు క్లోజ్ చేయాలి అనడంతో మాలిని షాక్ అవుతుంది. కావాలంటే జడ్జిగారు ముందర నాకు కారు యాక్సిడెంట్ జరగలేదని చెబుతాను అని అంటుంది. అప్పుడు మాలిని వెంటనే ఆ సులోచనపై సీరియస్ అవుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సులోచన ఆ మాళవిక జైలుకెందుకు వెళ్లకుండా ఆపుతున్నావు అని అంటుంది.
 

 అప్పుడు సులోచన ఎమోషనల్ అవుతూ నాకు దానికంటే నా కూతురు కాపురం ముఖ్యం అది బాగా ఉండటం నాకు ముఖ్యం వదిన అర్థం చేసుకోండి అని ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు అసలు విషయం తెలుసుకున్న వేద యష్ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు లాయర్ పరమేశ్వర్ ఝాన్సీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కేసు నేను గెలుస్తాను అని ఝాన్సీ అనగా అవకాశం లేదు నేను అన్ని దారులు మూసేశాను అని అంటుంది. ఝాన్సీ అసలు విషయం చెప్పడంతో పరమేశ్వర షాక్ అవుతారు.
 

ఆ తరువాత లాయర్ పరమేశ్వర్ యష్, మాళవిక దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మాళవిక అంటే నేను కాకుండా ఆదిత్య ఆక్సిడెంట్ చేసాడు అన్న విషయం బయట పడుతుందా అని అనడంతో అవును ఆ లాయర్ ఝాన్సీ ఎటువంటి దారులు లేకుండా అన్ని దారులను మూసేసింది అని అంటారు. అప్పుడు యష్ లాయర్ గారు మీరు తలుచుకుంటే ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేసి నా కొడుకు ఆదిత్యను కాపాడండి అని అంటాడు.
 

మీకు ఏం కావాలంటే అది చేస్తాను. ఆదిత్యకు శిక్ష పడకుండా ఉండేలా చూడండి అని అంటాడు. లాయర్ నేనేం చేయలేను మీ భార్య శబదం చేసింది అనుకున్నది నెరవేరుస్తుంది. సాక్షాధారాన్ని సంపాదించింది అని చేతులెత్తేస్తాడు. లాయర్ మాటలు విన్న యష్,మాళవిక ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత కోర్టు మొదలవుతుంది. మరొకవైపు వేద రాలేదు అని కోర్ట్ లో జడ్జి గారి నుంచి పర్మిషన్ తీసుకుంటుంది లాయర్ ఝాన్సీ. అందరూ కోర్టులో వేద కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొకవైపు వేద కోర్ట్ కి వస్తూ ఉంటుంది. అప్పుడు యష్ ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించారో అని బాధపడుతూ ఉంటుంది వేద. అప్పుడు వేద రావడంతో అందరూ సంతోషపడతారు. లాయర్ ఝాన్సీ జడ్జి గారికి పెన్ డ్రైవ్ ఇవ్వడంతో అప్పుడు వేద  జడ్జ్ గారు నేను కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంది. జడ్జిగారు నేను ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఈ కేసు వాపసు తీసుకోవాలి అనుకుంటున్నాను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

click me!