Guppedantha manasu: రిషికి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన వసుధార.. సాక్షి ఏం చేసిందంటే?

Published : Jul 29, 2022, 09:25 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha manasu: రిషికి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన వసుధార.. సాక్షి ఏం చేసిందంటే?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... వసుధార, రిషి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి తనలో తానే మాట్లాడుకోవడం చూసి రిషి లోపలికి వస్తాడు. నీలో నువ్వే ఏం మాట్లాడుకుంటున్నావ్? అని అడగగా ఎంటో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తుంది. ఆనందానికి కారణం ఏంటి? అని అడిగితే తర్వాత చెప్తా అంటుంది. ఈరోజు మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని మనసులో అనుకుంటుంది వసుదార. 
 

26

అప్పుడు రిషి వసుధార చేతిని పట్టుకొని చదువుల పండగకి తీసుకెళ్తాడు. దారిలో సాక్షి దాన్ని చూసి కుళ్ళుకుంటది. తర్వాత అందరూ కలిసి చదువుల పండగకు వెళ్తారు. అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. సాక్షి, రిషి దగ్గరికి వెళ్లి తనతో తినమని అడగగా రిషి మాత్రం వసుధార చెప్పినట్టు పిల్లలు అందరితో కలిసి వెళ్లి తింటాడు. దానికి సాక్షి చాలా కుళ్ళుకుంటుంది. 

36

తర్వాత సీన్లో వసుధార ఒంటరిగా చెట్టు కింద కూర్చొని చేతిలో రిషి ఇచ్చిన ఒక విరిగి పోయిన గ్లాస్ బొమ్మని  అందంగా అతికించి దాన్ని పట్టుకొని ఉంటుంది. రిషి సార్! ఒకప్పుడు మీరు నాకు ఇచ్చిన బొమ్మనే నేను మళ్ళీ మీకు తిరిగి అందంగా తయారు చేసి ఇస్తున్నాను. ఇదే ఈరోజు నేను మీకు ఇచ్చే కానుక అని మనసులో అనుకుంటూ ఉంటాది. ఆ బొమ్మ కింద "ఐలవ్యూ"అని చెప్పి మార్కర్ తో రాస్తాది. దాన్ని గిఫ్ట్ కవర్ తో చుట్టిన సమయంలో రిషి అక్కడికి వస్తాడు. 

46

ఆ గిఫ్ట్ని చూసి నాకోసమే చేసావు కదా? ఇవ్వు అని చెప్పి తీసుకుంటాడు. వసుధార, "తర్వాత ఇస్తాను" అనగా, దానికోసం ఇద్దరూ గొడవడి ఆఖరికి ఆ గిఫ్ట్ ని రిషి తీసుకొని ఇప్పబోతాడు. ఈలోగ వసుధార టెన్షన్ పడడం చూసి "సరే నీకు నచ్చినప్పుడే నాకు ఇవ్వు" అని చెప్పి గిఫ్ట్ తన చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు రిషి. ఈ సంఘటనంతా సాక్షి ఒక మూల నుంచి చూస్తుంది. "నీకు నేను మంచి గిఫ్ట్ ఇస్తాను వసుధార" అని మనసులో అనుకుంటుంది. 
 

56

తర్వాత చదువుల పండుగ మీటింగ్ రూమ్ లో అందరూ రిషిని, ప్రోగ్రాం ఘనవిజయం సాధించినందుకు అభినందిస్తూ ఉంటారు. అప్పుడు సాక్షి ,రిషి కి చాలా మెసేజ్ లు పంపుతాది. కానీ రిషి వాటిని చదవడు. ఈలోగ వసుధార, ఆ గిఫ్ట్ ని బ్యాగ్ లో పెట్టి ,"ఈరోజు ఎలాగైనా రిషి సార్ కి ఆ గిఫ్ట్ ని ఇవ్వాలి" అని అనుకుంటుంది. చదువుల పండుగ మీటింగ్ లో మహేంద్ర, రిషిని పొగుడుతూ కొన్ని వాక్యాలు చెప్తాడు. 

66

తరువాత రిషి, మాట్లాడుతూ వాళ్ల పెద్దమ్మని, పెదనాన్నని, జగతి మేడంని,ముగ్గురిని స్టేజి మీదకి రావాలని కోరుతాడు. ఈలోగ సాక్షి తను కూడా చదువుల పండగ గురించి మాట్లాడతాను అని చెప్పి స్టేజ్ మీదకి వస్తుంది. అదే సమయంలో వసుధార రిషికి ఆ గిఫ్ట్ ఇవ్వాలని పిలిచి గిఫ్ట్ ఇస్తుంది. రిషి గిఫ్ట్ ని తీస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

click me!

Recommended Stories