Guppedantha Manasu: దేవయానిని బ్రతిమిలాడిన మహీంద్రా.. రిషీ మనసు మార్చేందుకు వసుధార ప్రయత్నం?

First Published Aug 10, 2022, 9:48 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, సాక్షిని గది బయటికి వెళ్లిపోమంటాడు దేవయాని సాక్షిని బయటకు తీసుకువచ్చేస్తుంది. అదే సమయంలో జగతి, వసుధార అక్కడికి వస్తారు. అప్పుడు సాక్షి వసుధారని తిడుతూ అసలు ఇదంతా నీ వల్లే మొదలైంది.నీవల్లే నా రిషి నా దగ్గర నుంచి దూరమైపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు ఎందుకు వచ్చావు? అని అరుస్తూ ఉండగా రిషి తలుపు తీస్తాడు. రిషి వాసుదారను చూసుకుంటూ ఉంటాడు.సాక్షికి చిరాకు వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.అప్పుడు జగతి, నాతో పనుండి వచ్చింది అని చెప్తుంది.
 

ఆ తర్వాత జగతి,వసుధర ఇద్దరు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు రిషి సార్ ని వెళ్లి అసలు ఏమైందో కనుక్కుంటాను అని వసు అనగా జగతి ఇది సమయం సందర్భం కాదు. రిషికి ఇప్పుడు మూడు బాలేదు చాలా కోపంగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో మాట్లాడడం మంచిది కాదు అని అంటుంది.అప్పుడు వసుధార, తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పడం మన బాధ్యత కదా మేడం అని అనగా, ఇది బాధ్యతలు గురిం,చి హక్కుల గురించి అడిగే సమయం కాదు అని నచ్చచెప్పుతుంది జగతి.
 

ఆ తర్వాత వసు ఇంటికి వెళ్లిపోయే సమయంలో మెట్లు దిగుతున్నప్పుడు కాలు  జారుతుంది.అదే సమయంలో రిషి అక్కడికి వచ్చి వసూనీ పట్టుకుంటాడు.సారీ సర్ చూసుకోలేదు అని వసు అనగా పరధ్యానం లో ఉన్నావ్ ఎందుకు? అని అడుగుతాడు రిషి. పర ధ్యానం కాదు సార్ మీ ధ్యానమే అని అంటుంది వసు.ఈలోగా దేవయాని అక్కడికి వచ్చి రిషితో, రేపు సాక్షి వాళ్ళ తల్లిదండ్రులు లగ్నపత్రిక కోసం వస్తున్నారు అని చెబుతోంది. నువ్వు కూడా రేపు ఇక్కడ ఉంటే మంచిదనుకుంటున్నాను వసుధార అని అంటుంది. 
 

తర్వాత దేవయాని జగతి మహీంద్రా దగ్గరికి వెళ్లి రేపు సాక్షి తల్లితండ్రులు లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తున్నారు అని చెబుతుంది.అప్పుడు మహేంద్ర, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు.కావాలంటే రిషి ని జీవితాంతం జగతిని అమ్మ అని పిలవద్దని చెప్తాను. దయచేసి పెళ్లి ని ఆపేయండి. మీ అధికారానికి మేము విలువిస్తాము పెద్దయ్యక మీ మాటను ఎప్పుడు జవదాటము అని అంటాడు. అప్పుడు దేవయాని మీ అందరి కళ్ళముందే నేను సాక్షితో పెళ్లి వద్దని చెప్పాను.
 

కానీ రిషియే చేసుకుంటా అన్నాడు. నేను దానికి సరే అన్నాను అంతే అని నటిస్తుంది. ధరణి,దేవయాని నటనను మనసులో పొగుడుకుంటుంది.తర్వాత సీన్లో రిషి కారులో బయటకు వెళ్తుండగా వసు అక్కడికి వస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి సార్. మీకు చెప్పే అంత దాన్ని కాదు గాని మీకు చెప్పడం నా బాధ్యత అనుకుంటున్నాను అని వాసు అనగా రిషి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు పదిసార్లు ఆలోచిస్తాను. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకోను.
 

అయినా నేను ఒక కాలేజ్ కి ఎండి ని నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటానని నువ్వు ఎలాగ అనుకున్నావు?. అనగా  వసు,అయినా సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి సార్ ఒకప్పుడు తన గురించి అంతా తెలుసుకున్నారు లైబ్రరీలో జరిగిన విషయం గురించి మిమ్మల్ని బెదిరించిన విషయం గురించి ఇంత తెలిసిన సరే మీరు తనని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు సర్ మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెడుతున్నారా?మీకంటూ ఒక మనసు ఉంటుంది కదా సార్ దాన్ని నమ్మండి అని అంటుంది. గతంలో కూడా నేను నా మనసును ని నమ్మి ఒక పని చేశాను.
 

దాని ఫలితం ఏంటో నీకు తెలుసు కదా? అని రిషి, వసు కి ప్రపోజ్ చేసిన సీన్ ని ఉద్దేశిస్తూ చెబుతాడు. ఇంకో విషయం నన్ను ఎవరూ బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు నాకు నచ్చితేనే నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత సీన్లో జగతి, మహీంద్రలు ఈ పెళ్లి గురించి బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు సాక్షి పేరు వింటేనే నచ్చని రిషి సాక్షిని పెళ్లి చేసుకుందామని ఆలోచనే తన దగ్గరికి ఎలా తెచ్చుకున్నాడో కూడా అర్థం కావడం లేదు అని జగతి అంటుంది.
 

ప్రతిసారి ఏ విషయం జరిగిన రిషి నాకు చెప్పేవాడు.నాన్న నేను ఇది చేస్తున్నాను,నాన్న నేను అది చేస్తున్నాను, అని నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న సరే నాకు ఏమీ చెప్పట్లేదు, మనమే  వాడికి తెలియకుండా దూరం అవుతున్నాము అని బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. ఒక లెక్కన మీ దూరానికి కారణం నేనే అని అంటుంది జగతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే వరకు ఎదురుచూడాల్సిందే!

click me!