మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన హీరోయిన్ కృతి శెట్టి. `ఉప్పెన` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. మెగా హీరో వైష్ణవ తేజ్ కూడా ఈ మూవీతోనే హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సైతం దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఇలా అంతా కొత్తవాళ్లు కలిసి చేసిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ని పోషించడం విశేషం. ఈ సినిమా కరోనా సమయంలోనే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసింది. ముగ్గురిని స్టార్స్ చేసింది. హీరో, హీరోయిన్, దర్శకుడు సక్సెస్ అయ్యారు.