ఎన్టీఆర్, పవన్ లని దాటుకుని వస్తే.. నితిన్, రామ్, నాగ చైతన్యకి భలే చిక్కొచ్చిపడింది ?

First Published Apr 18, 2024, 8:04 PM IST

ఈ పరిస్థితిని ముందుగా గమనించిన హీరో నితిన్ క్రిస్టమస్ కి కర్చీఫ్ వేసేశాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పండగ వచ్చిందంటే టాలీవుడ్ లో సినిమాల సందడి ఎలా ఉంటుందో వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో నిర్మాతల మధ్య గొడవలు చూస్తూనే ఉన్నాం. ప్రతి సంక్రాంతికి కనీసం మూడు నాలుగు బడా చిత్రాలు కర్చీఫ్ వేసుకుని కూర్చుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో రెడీ అవుతున్నారు. 

ఇక దసరాకి ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించారు. దసరాకి కొద్దిరోజుల ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి మూవీ సందడి ఉండబోతోంది. దీనితో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి గందరగోళంగా మారింది. పెద్ద హీరోలు దసరా, సంక్రాంతిని కబ్జా చేసేయడంతో మీడియం రేంజ్ హీరోలు ఆల్టర్ నేటివ్ వెతుక్కుంటున్నారు. 

ఈ పరిస్థితిని ముందుగా గమనించిన హీరో నితిన్ క్రిస్టమస్ కి కర్చీఫ్ వేసేశాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కిష్టమస్ సీజన్ లో అయినా తన చిత్రాన్ని ప్రశాంతంగా రిలీజ్ చేసుకోవచ్చు అనే పరిస్థితి నితిన్ కి లేదు. 

ఎందుకంటే అందుతున్న సమాచారం మేరకు క్రిస్టమస్ కి మరికొందరు యువ హీరోలు సిద్ధం అవుతున్నారు. నాగ చైతన్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు తండేల్ చిత్రంతో రెడీ అవుతున్నారు. ఈ చిత్రం క్రిస్టమస్ కి రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు రామ్ పోతినేని కూడా డబుల్ ఇస్మార్ట్ లో క్రిస్టమస్ కే రాబోతున్నట్లు తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరోలు అయినప్పటికీ అవన్నీ మంచి అంచనాలు ఉన్న చిత్రాలు. ముగ్గురూ ఆ సమయానికే వస్తే తప్పకుండా వసూళ్ల విషయంలో డ్యామేజ్ ఉంటుంది. 

పోటీ వద్దనుకుని సంక్రాంతికి వెళ్ళలేరు.. అలాగని దసరాకి వెనక్కీ రాలేరు. ఈ యువ హీరోల చిత్రాలకు విచిత్రమైన పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. 

click me!