`చిత్రం`తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` చిత్రాలతో విజయాలు అందుకున్నారు ఉదయ్ కిరణ్. మధ్యలో రెండు యావరేజ్లు పడ్డాయి. మళ్లీ `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `ఔనన్నా కాదన్నా` చిత్రాలతో సక్సెస్ సాధించారు.
స్టార్ అయిపోయాడు ఉదయ్. ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. `గుండె ఝల్లుమంది` ఫర్వాలేదు, కానీ పెద్ద హిట్ కాదు, అప్పటికే కెరీర్ డౌన్ అయ్యింది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.