ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీనితో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. లవర్ బాయ్ గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం జై శ్రీరామ్. ఈ మూవీ టైంలో తన కెరీర్ పతనం గురించి ఉదయ్ కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో జోరు ప్రదర్శించిన ఉదయ్ కిరణ్ కి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ విషయంలో చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో చాలా రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి.