అయ్యే అమ్మా మీరు వచ్చారేంటి. నేనే వచ్చి కలిసేదాన్ని కదా అని నేను అన్నాను. ఏమైంది ఇప్పుడు ఎవరొస్తే ఏమి.. అని తారకం గారు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, అని బసవతారకమ్మను గుర్తు చేసుకున్నారు ఊర్వశి శారద. నిజంగా ఆ ఇద్దరు పుణ్య దంపతులు, అంత మంచి వారిని నేను ఎక్కడా చూడలేదు. ఆమె మనసు కూడా ఎన్టీఆర్ మాదిరిగానే గొప్పది అని శారద గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.