Brahmamudi: ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా?

Published : Mar 06, 2026, 11:14 AM ISTUpdated : Mar 06, 2026, 01:30 PM IST

Brahmamudi: ఎగ్జామ్ వెళ్లేందుకు ఇందుకు టైం అవుతున్నా రేఖ ఇంట్లోనే ఉండటంతో వెళ్లలేకపోతుంది. దేవుడితో మాట్లాడుతూ తన కష్టాలను చెప్పుకుంటుంది. మరోవైపు రాజు ల్యాప్ టాప్ అమ్మేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఇందు ఎగ్జామ్ కు వెళ్తుందా? రాజు ల్యాప్ టాప్ అమ్ముతాడా? 

PREV
17
బ్రహ్మముడి

ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమ్ముడు వెంకటేశ్వర్లును చూసి రాజు కొంత అసహనంగా మాట్లాడుతాడు. అదే సమయంలో తండ్రి అతనిని మందలిస్తూ, వాడు ఉద్యోగం చేసి ఇంటికి సహాయం చేస్తున్నాడు… నువ్వు మాత్రం ఏ పని చేయకుండా భూమికి భారంగా ఉండిపోయావని అంటాడు. దానికి రాజు తాను ఇన్వెస్ట్ మెంట్ అని చెబుతాడు. 

27
కొడుకు బాగుపడాలని తండ్రి తిట్లు

అయితే లాభాలు ఎప్పుడొస్తాయో అని తండ్రి అడిగిన ప్రశ్నకు…ఫ్యూచర్ లో వస్తాయని రాజు సమాధానమిస్తాడు. ఎంత తిట్టినా నువ్వు జన్మలో మారవంటూ తండ్రి రాజును తిడతాడు. అప్పు తీసుకుని మూడు సంవత్సరాలు తిరిగి చెల్లించకపోతే అది రద్దు అవుతుందనే తన వాదనను రాజు చెబుతాడు. కొడుకి మాటల్లో తెలివి కనిపిస్తోందని తల్లి లక్ష్మి సంతోషపడిపోతుంది. తండ్రి మాత్రం బిజినెస్ చేయడం ఇష్టం లేదని, తాను ఎలాంటి సహాయం చేయనని చెప్పేస్తాడు. తండ్రి మాటలకు చిరాకు పడి టిఫిన్ కూడా తినకుండా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిపోతాడు రాజు. రాజును తిడితే ఎందుకు అని లక్ష్మి తన భర్తపై కోపమవుతుంది.

37
ఎగ్జామ్ కు టైం అవుతున్నా వెళ్లలేక ఇందు ఇబ్బందులు

ఇదిలా ఉండగా మరోవైపు ఇంట్లో ఇందు వంట పనుల్లో బిజీగా ఉంటుంది. పరీక్ష సమయం దగ్గరపడుతున్నా వెళ్లే అవకాశం లేకపోవడంతో కంగారుపడుతుంది. రేఖ ఇంట్లో లేకపోతే తాను ఎగ్జామ్‌కు వెళ్లేదాన్ని కదా అని అనుకుంటుంది. ఈలోపు రేఖ, ఆమె భర్త భూషణ్ కూడా టిఫిన్ చేయడానికి కిందికి వస్తారు. డైనింగ్ టేబుల్ పై అప్పుల విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. చక్రి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అతను పదే పదే అడుగుతున్నాడని రేఖ చెప్తుంది. అతనితో మాట్లాడమని చెప్పినా భూషణ్ అతను వినే పరిస్థితిలో లేడని చెబుతాడు. వెంటనే రేఖ క్లబ్‌లో ఆడుతూ తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతూ భర్తను తిడుతుంది. అప్పుడే ఇందు దోశె తీసుకొస్తే రేఖ దాన్ని వద్దని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెప్తుంది. ఎగ్జామ్ కు టైం అయిపోతున్నా ఇందు మళ్లీ కిచెన్‌లోకి వెళ్తుంది. 

47
ఒక పరీక్షకు బదులు మరో సబ్జెక్టు చదువుతూ అత్తకు దొరికిపోయిన ఐశ్వర్య

ఆస్తి సొంతం చేసుకునేందుకు హెల్ప్ చేస్తావని నిన్ను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు భారంలా మారిపోయావని భర్తను రేఖను మందలిస్తుంది. ఎప్పుడు టైంకు వెళ్లే రేఖ వెళ్లకపోవడంతో ఇందు కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా ఐశ్వర్యకు కూడా ఈరోజు పరీక్ష ఉందని గుర్తొచ్చిన ఇందు... ఆమెకు ఏం టిఫిన్ పెట్టాలని రేఖను అడుగుతుంది. ఐశ్వర్య ఇంకా పడుకునే ఉందని తెలిసి రేఖ కోపంగా ఆమె గదికి వెళుతుంది. అయితే అక్కడ ఐశ్వర్య చదువుతూ కనిపిస్తుంది. తెల్లవారే 3 గంటలకు లేచానని యోగా, జిమ్ చేసానని, సిలబస్ ముందే పూర్తి చేసేశానని, రివిజన్ చేస్తున్నానన ఐశ్వర్య చెబుతుంది. అంత ఇంటెలిజెంట్ అయితే పది బ్యాక్‌లాగ్‌ల సంగతేంటని రేఖ ప్రశ్నిస్తుంది. ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంటే...మరో సబ్జెక్టు ఎలా చదువుతున్నాని ప్రశ్నించడంతో దొరికిపోతుంది. చివరకు త్వరగా రెడీ అయితే ఎగ్జామ్ హాల్ దగ్గర దించి ఆఫీసుకు వెళ్తానని రేఖ చెబుతుంది. 

57
పాత ల్యాప్ ట్యాప్ రాజు చావు తెలివితేటలు

ఇంకోవైపు రాజు తన బైక్ దగ్గర ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటాడు. లాప్‌టాప్ రిపేర్ చేశావా అని అడిగితే, దాన్ని అమ్మే ప్లాన్ చేస్తున్నానని చెబుతాడు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.50 వేలకు పెట్టానని, కొనేవారిని మాటలతో ఆకట్టుకోవాలని రాజు అంటాడు. కస్టమర్‌తో కలుసుకునేందుకు ఖరీదైన హోటల్ మిలాన్‌ను ఎంపిక చేస్తాడు. అలాంటి చోట కలిస్తే మన మాటలకు విలువ పెరుగుతుందని రాజు చెప్పడంతో ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు.

67
దేవుడి బాధలు చెప్పుకుంటున్న ఇందు

ఇదే సమయంలో ఇందు దేవుడి ముందు తన బాధను చెప్పుకుంటుంది. ఐశ్వర్య చదవకపోయినా అన్నీ ఇచ్చి తనకు మాత్రం పరీక్ష రాసే అవకాశం కూడా రావడం లేదని బాధపడుతుంది. ఈ సమయంలో స్వాతి, అపర్ణ ఇద్దరూ ఇందుకు సహాయం చేయాలని ఒక చిన్న ప్లాన్ వేస్తారు.

స్వాతి తన డ్రెస్ స్టిచ్చింగ్ కు ఇవ్వాలనే పేరుతో ఇందును బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. భ్రమరాంబ ముందు ఇదంతా డ్రామా ప్లే చేస్తారు. 

77
ఇందు ఎగ్జామ్ రాస్తుందా?

మరి ఈ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా? ఇందు ఎగ్జామ్‌కు వెళ్తుందా? రాజు తన తెలివితో లాప్‌టాప్‌ను ఎక్కువ ధరకు అమ్మగలడా? అన్న ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories