అప్పుడు లాస్య ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను అని అంటుంది. అప్పుడు మీరందరూ నా వాళ్లు అనడంతో వెంటనే నందు నువ్వు మా అమ్మ నాన్న ఎప్పుడైతే అవమానించావో అప్పుడు నువ్వు పరాయి దానివి అయ్యావు అని అంటాడు. అయినా ఇప్పుడు నేనేమీ తప్పు మాట్లాడటం లేదే అందరినీ ఇంటి లోపలికి రమ్మంటున్నాను అని అంటుంది లాస్య. ఇప్పుడు ప్రేమ్,అభి వాళ్ళందరూ మేము మా అమ్మ దగ్గరే ఉంటాము అని అనడంతో అప్పుడు తులసి మీరేమంటారు నందగోపాల్ గారు అని అనగా వెంటనే లాస్య అందరూ డిస్కస్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి అని ఆ పేపర్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది.