రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్, కారణం ఏంటో తెలుసా?

Published : Jul 04, 2025, 02:55 PM IST

ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఆఫర్ ఇస్తే చాలు అని స్టార్లు కూడా ఎదరుచూస్తుంటారు. అటువంటిది రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే, స్వయంగా రాజమౌళి అడిగినా కూడా రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? దానికి కారణం ఏంటి?

PREV
16

దర్శక శిఖరం ఎస్.ఎస్. రాజమౌళి తో సినిమా అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎగిరి గంతేయ్యాల్సిందే. ఆయన సినిమాలో చిన్న వేశం వచ్చినా చాలు అనుకునేవారు ఎందరో ఉన్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే ఆదరించని ఆడియన్స్ ఉంటారా? పాన్ ఇండియా స్థాయిలో ఉన్న స్టార్ డైరెక్టరుగా ఆయనను వేలాది మంది అభిమానిస్తారు. ఆర్టిస్ట్ లు రాజమౌళి సినిమాలో నటించడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదరుచూస్తూ ఉంటారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం జక్కన్న సినిమా ఆఫర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

26

ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. అవును చెన్నై చిన్నది త్రిష. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిషకు రాజమౌళి గురించి తెలిసి కూడా ఎందుకు ఆయన సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిందబ్బా అని అందరికి అనుమానం కలిగి ఉండవచ్చు. దానికి ఓ పెద్ద రీజన్ కూడా ఉందట. త్రిషను రాజమౌళి హీరోయిన్ గా ఆఫర్ చేసింది స్టార్ హీరో సరసన హీరోయిన్ గా నటించడానికి కాదు. స్టార్ కమెడియన్ గా కొనసాగున్న సునిల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం కోసం జక్కన్న త్రిషన్ సంప్రదించాడట.

36

అయితే త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్. అవ్వడం.. ఎంత రాజమౌళి సినిమా అయినా సరే..కామెడియన్ గా తన సినిమాల్లోనే నటించిన సునిల్ పక్కన హీరోయిన్ గా నటించడానికి త్రిష మనసు ఒప్పుకోలేదట అంతే కాదు ఆతరువాత తన కెరీర్ కు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని త్రిష ఆలోచించి ఈ ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇక త్రిష రిజెక్ట్ చేసిన తరువాత రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్‌ లు అయితే ఒప్పుకోరు అని అర్ధం చేసుకున్నాడు. దాంతో కొత్త అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నాడట. ఆ రకంగా సలోనీ రంగంలోకి వచ్చింది.

46

ఈ సినిమా రావడం సలోనికి జాక్ పాట్ అని చెప్పాలి. ఈమూవ తరువాత సలోనీ కెరీర్ పరుగులు పెడుతుంది అని అనుకున్నారు జనాలు. కాని నిజానికి మర్యాదరామన్న తరువాత సలోనీకి రెండు మూడు చిన్న సినిమాలు తప్పించి పెద్దగా ఆఫర్లు లేవు. అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. ఇక మరో సారి కూడా త్రిష రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట. ఇక సరిగ్గా 14ఏళ్ల కిందట రిలీజై ‘మర్యాద రామన్నా’ ఊహించని రేంజ్‌లో హిట్టయింది.

56

అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి.. అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు. రాజమౌళికి ప్లాప్ రికార్డ్ లేదు. సునిల్ తో సినిమా అనేసరికి చాలామంది వద్దు అని సలహా ఇచ్చారట. ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్ చెడగొట్టుకోవద్దు అని అన్నారట. కాని హిట్ కొట్టి తీరతాను అని చెప్పిన జక్కన్న చేసి చూపించాడు.

66

సునిల్ ఈసినిమాతో హీరోగా ఫిక్స్ అయ్యాడు.. బంపర్ హిట్ కొట్టాడు. కేవలం 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా .40 కోట్లకు పైగా కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. కానీ సునిల్ ఆతరువాత తన కెరీర్ ను నిలబెట్టుకోలేకపోయాడు. రాజమౌళి మాత్రం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఆస్కార్ రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు జక్కన్న.

Read more Photos on
click me!

Recommended Stories