2002లో ‘మౌనం పెసియదే’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన త్రిష, ‘మనసెల్లామ్’, ‘సామి’, ‘గిల్లి’, ‘తిరుప్పాచి’ వంటి హిట్ సినిమాల్లో నటించారు.
ప్రభాస్తో `వర్షం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి మూవీతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో కూడా పాగా వేసింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే` చిత్రాలతో ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది.
ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’, అలాగే ‘కరుప్పు’ సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలోని ఆమె పాత్రకు విమర్శలు వచ్చాయి.