ఫిల్మ్ ఇండస్ట్రీలో.. మరీ ముక్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగు పదులు దాటినా.. ఇంకా గ్లామర్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో త్రిష, నయనతార ముందు ఉన్నారు. త్రిష 40 ఏళ్లు వయస్సు దాటగా.. నయనతార 40కి అడుగు దూరంలో ఉంది. అయితే ఈ ఇద్దరు తారలు సౌత్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగారు. ఆల్ మోస్ట్ స్టార్ హీరోల సరసన మెరిసారు. ఇప్పటికీ హీరోయిన్లు గా కొనసాగుతూ.. తమ సత్తా చాటుతున్నారు. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు.
సమంతను దూరం పెడుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..? ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేశారుగా..?
trisha photo gallery
1999లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష. దాదాపు 25 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. తమిళంలో విజయ్, అజిత్, సూర్య, శింబు, కమల్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో.. తెలుగులో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ , ప్రభాస్ లాంటి ప్రముఖ హీరోలతో జోడీ కట్టింది త్రిష.
దీపికా, కరీనా.. ఆలియా తో పాటు ప్రెగ్నెంట్ గా ఉండి సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఇంకెవరంటే..?
Trisha
హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. అందరికి షాక్ఇచ్చింది. ఇక ఆతరువాత విజయ్ తో లియో హిట్ అవ్వడంతో ఇప్పుడు అజిత్, కమల్, చిరంజీవి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 40 ఏళ్ళు దాటినా బ్యూటీ కాని ఫిట్ నెస్ కాని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది.
త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?
पति देव की आंखों का बनेंगी तारा, पहन कर देखें नयनतारा सी साड़ी
అటు నయనతార కూడా యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ లో ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోయిన్ స్టేజ్ కు వచ్చింది. శింబుతో ప్రేమ, ప్రభుదేవతో రిలేషన్.. ఇలా వివాదాలు చుట్టుముట్టినా.. కెరీర్ పరంగా అవి ఆమెకు మైనస్ అవ్వలేదు. ఇప్పటికీ వరుసగాసినిమాలు చేస్తూ.. 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ.. బిజీ బిజీగా ఉంది నయనతార.
రజినీకాంత్ తో వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా.. డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా..?
ఇక ఈ ఇద్దరు తారలు స్టార్లు గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేశారు. అంతే కాదు ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులు గా ఉన్నారు. ఇక వీరి మధ్య విభేదాలకు సబంధించిన త్రిష ఓ సందర్భంలో స్పందిస్తూ... క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ తనకు, నయనతారకు సమస్య ఉన్న మాట వాస్తవమే అని అన్నారు.
అయితే ఈ విభేదాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, సమయం గడిచేకొద్దీ మేము ఒకరినొకరు అర్థం చేసుకున్నామని త్రిష చెప్పింది. ఇప్పుడు మనం స్నేహితులం అని కూడా త్రిష అన్నారు. అయితే వీరిమధ్య విబేధాలకు కారణం ఓ సినిమా అని తెలుస్తోంది. గతంలో నయనతార కురువి సినిమాలో మొదటగా నటించిగా.. ఆ అవకాశం నయనతార నుంచి త్రిషకు వెళ్లింది.