బాలీవుడ్ పై తెలుగు రీమేక్ సినిమాల దండయాత్ర... టాలీవుడ్ కథలపై బాలీవుడ్ మోజు..

First Published Jan 24, 2022, 10:22 AM IST

బాలీవుడ్(Bollywood) మేకర్స్ మన సౌత్ సినిమాలపై మోజు పడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు అంటే పడి చచ్చిపోతున్నారు. మాస్ ను మెప్పించే ఇక్కడి సినిమాలంటే నార్త్ ఆడియెన్స్ కళ్లప్పగిస్తున్నారు. జనాల ఇష్టాన్ని క్యాష్ చేసుకునే పనిలో భాగంగా దాదాపు  పాతిక సినిమాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో మన తెలుగు సినిమాలదే అగ్రభాగం.

ఒకప్పుడు సౌత్ సినిమాలు అన్నా.. సౌత్ కథలు అన్నా చీప్ గా చూసేవాళ్లు బాలీవుడ్ (Bollywood)  జనాలు. మన కథలను ఇండ్లీ సాంబార్ కథలంటూ హేళన చేసేవారు కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ డామినేషన్ పెరిగింది. సౌత్ నుంచి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతున్నారు. మన సినిమాలు బాలీవుడ్(Bollywood) ను ఆకర్షిస్తున్నాయి. ఒక రకంగ చెప్పాలంటే.. సౌత్ నుంచి ముఖ్యంగా మన టాలీవుడ్(Tollywood)  బాలీవుడ్ ను క్రాస్ చేసి.. మార్కెట్ ను విస్తరించుకుంది. దాంతో సౌత్ కథలను తీసుకుని అక్కడ  రీమేక్ చేస్తే పోలే అనుకుంటున్నారు నార్త్ మేకర్స్.

 అర్జున్ రెడ్డి(Arjun Reddy) రీమేక్ కబీర్ సింగ్ సూపర్ సక్సెస్ తో నాని(Nani) నటించిన జెర్సీ సినిమాను షాహిద్ కపూర్ (Shahid Kapoor)అదే పేరుతో రీమేక్ చేసాడు. కొవిడ్ కారణంగా వాయిదాపడిన ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. తెలుగు జెర్సీమూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరే హిందీ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి

తెలుగు లో సూపర్ హిట్ అయిన అల్లు అర్జున్(Allu Arjun) అలవైకుంఠపురమలో మూవీనీ.. హిందీలో రొమాంటిక్ హీరో కార్తీక్ ఆర్యన్, కృతీసనన్ జంటగా..  పరేశ్ రావల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో కలిసి రీమేక్ చేస్తున్నారు.  షెహ్ జాదా  టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో టబు పాత్రను మనీషా కోయిరాల  చేయబోతుంది.

అల్లరి నరేశ్ (Allari Naresh)నాంది సినిమాను కూడా బాలీవుడ్ లో  రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాను చూసిన  బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్(Ajay Devgan) స్వయంగా ఈ సినిమా హక్కులు తీసుకుని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అల్లరి నరేష్ పాత్రను అజయ్ దేవగణ్ పోషిస్తున్నారు. దీనితో పాటు అటు దృశ్యం 2 హిందీ రీమేక్ కు  కూడా త్వరలోనే ముహూర్తం పెట్టబోతున్నారు.

మన తెలుగు సినిమాలపై ఎక్కవ ఇంట్రెస్ట్ చూపిస్తున్న హీరోలలో అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బచ్చన్ పాండే సినిమా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేశ్ ను ఆధారంగా చేసుకొని రాబోతుంది. అలాగే అక్షయ్ కుమార్ చేతిలో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన  రాక్షసుడు రీమేక్ కూడా ఉంది. మిషన్ సిండ్రెల్లా పేరుతో హీందీలోరీమేక్ అవుతుంది ఈమూవీ ఈసినిమాలో.. రకుల్ ప్రీత్ సింగ్ లేడీ లీడ్ గా కనిపించబోతుంది.

అలాగే విశ్వక్ సేన్ హీరోగా నాని(Nani) నిర్మాతగా వచ్చిన హిట్(Hit) సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు.  తెలుగులో హిట్ సినిమాను డైరెక్టర్ చేసిన  శైలేష్ కొలను హిందీ హిట్ సినిమాకు కూడా వర్క్ చేస్తుండగా దిల్ రాజు కో ప్రొడ్యూసర్ గా ఈ రీమేక్ ను నిర్మిస్తున్నారు.

ఇక తెలుగులో సూపర్ సక్సెస్ అయిన నవ్వుల సినమా ఎఫ్2(F2) రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీకపూర్. తన తనయుడు అర్జున్ కపూర్(Arjun Kapoor) హీరోగా బాలీవుడ్ ఫన్ డోస్ ను స్టార్ట్ చేయబోతున్నారు.కాకపోతే తెలుగులో వెంకటేష్ చేసిన రోల్ ను హిందీలో  ఎవరు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ప్రభాస్(Prabhas), రాజమౌళి ఫస్ట్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనినాస్ హీరో నటిస్తుండగా ... వివి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగు హీరో.. తెలుగు డైరెక్టర్ కలసి బాలీవుడ్ కు తెలుగు రీమేక్ సినిమాను హిందీలో చూపించబోతున్నారు.

మన తెలుగు సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న హీరోలలో సిద్ధార్ధ్ మల్హోత్రా కూడా ఉన్నారు. ఆయన ఏకంగా రెండు తెలుగు సినిమాలను బాలీవుడ్ లో రీమేక్  చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాను సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా హిందీలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు దీనితో పాటు అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ దువ్వాడ జగన్నాథం హిందీ రీమేక్ లో కూడా సిద్ధార్ధ్ మల్హోత్రానే హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ సెట్స్ పైన ఉంది.

టాలీవుడ్ నుంచి ఇంచ చాలా రీమేక్ లు బాలీవుడ్ చేరుతున్నాయి. అందులో శ్రీవిష్ణు, నివేథా థామస్ లీడ్ రోల్స్ చేసిన బ్రోచేవారెవరురా ను హిందీలో తీస్తున్నారు. కరణ్ డియోల్. అభయ్ డియోల్ నటిస్తున్న ఈ మూవీని అజయ్ దేవగణ్ నిర్మిస్తున్నాడు. వీటితో పాటు  జులాయి, క్రాక్, అరుంధతి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఇలా టాలీవుడ్ నుంచి  బాలీవుడ్ ప్లైట్ ఎక్కిన తెలుగు  రీమేక్ సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది.  

click me!