రెచ్చిపోయిన రెజీనా కసాండ్రా... నన్ను అంతమాట అంటారా అంటూ...?

First Published Sep 7, 2022, 10:36 AM IST

ఈ మధ్య ప్రెస్ మీట్ లలో హీరోయిన్ల విషయంలో వరుసగా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఆమధ్య నేహా శెట్టి.. ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొగా.. ఇప్పుడు ఆ వంతు హీరోయిన్ రెజీనాకు వచ్చింది. దాంతో ఆమె కోపం ఆపుకోలేక మండిపడింది.
 

నివేదా థామ‌స్ , రెజీనా కసాండ్రా  లీడ్ రోల్స్ లో నటించి.. యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న సినిమా శాకిని ఢాకిని. ప్రముఖ దర్శకుడు సుధీర్ వ‌ర్మ‌ డైరెక్ట్ చేసిన ఈ  సినిమాను ముందుగా  ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఈసినిమాను  థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు టీమ్.

సెప్టెంబ‌ర్ 16న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది శాకిని డాకిని.అయితే ఈమూవీ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు టీమ్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ రెజినా కస్సాండ్రని ఓ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న మీద రచ్చ రచ్చ జరిగింది. 

సినిమాలో రెజినా ఓసీడీతో ఇబ్బంది పడే పాత్ర పోషించింది. ఇలాంటి పాత్రలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా రీసెంట్ ఇయర్స్ లో యంగ్ హీరో  శర్వానంద్  కూడా మహానుభావుడు సినిమాలో ఓసీడీ సమస్యతో బాధపడే యువకుడిగా నటించారు. అయితే ఈ విషయంపై రెజీనాకు షాకింగ్ క్వశ్చన్ ఎదురయ్యింది. 

మీక్కూడా ఓసీడీ సమస్య వుందా.? అని హీరోయిన్ రెజినాని ఓ జర్నలిస్టు కామన్ గా క్వశ్చన్ అడిగాడు. ఈ ప్రశ్నతో ఆ హీరోయిన్ కు చిర్రెత్తుకొచ్చింది. కోపం ఆపుకోలేక రెచ్చిపోయింది. ఓసీడీ అనేది ఓ వ్యాధి అనీ.. ఈ ప్రశ్న నన్ను అయితే అడగగలిగారు కాని.. ఇలా  ఓ హీరోని అడగ్గలరా.? అంటూ మండిపడింది బ్యూటీ. 
 

ఏదో కామన్ గా సరదాగా అడిగిన ప్రశ్నకు ఆమె ఎందుక అలా రియాక్ట్ అయ్యిందో అంటూ.. ఫిల్మ్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ఈ విషయంలో కొంత మంది ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది హీరోయిన ను విమర్షిస్తున్నారు. జస్ట్ లైట్ తీసుకోవాల్ని ఓ విషయంపై రెజినా, ఇంతలా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయినట్లు.? కొంత మంది అనకుంటున్నారు. మరికొంత మంది మాత్రం ఇదేం ప్రశ్న అంటూ  మండిపడుతున్నారు. 

click me!