పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి బుల్లితెరపై కూడా తన ప్రత్యేకతను చూపించారు. ఆయన “నెంబర్ వన్ యారీ” అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా చేశారు. ఈ షోలో సినీ సెలబ్రిటీలతో సరదాగా సంభాషిస్తూ, తన చమత్కారంతో ప్రేక్షకులను అలరించారు.
తన ఫ్రెండ్లీ నేచర్, ఫన్ తో గెస్టులనే కాకుండా ఆడియన్స్ ను కూడా పుల్ ఎంటర్టైన్మెంట్ పంచారు. ఈ షో ఆహా, వియూ వంటి ఓటీటీలలో ప్రసారమై మంచి ఆదరణ పొందింది. రానా యాంకర్గా తనదైన స్టైల్ను చూపించి బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.