పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని కార్తీ క్షమాపణలతో చల్లార్చే ప్రయత్నం చేశారు. తెలుగులో మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తీ ఒకరు. రాజకీయ వివాదాల్లో తలదూర్చడం ద్వారా ఓ వర్గానికి దూరం కాకూడదని కార్తీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పారు.
ఇక సత్యం సుందరం విషయానికి వస్తే... ఇది విలేజ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కార్తీ పల్లెటూరికి చెందిన అమాయకుడైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అరవింద స్వామి పట్నంలో ఉంటున్న పల్లెటూరి వ్యక్తి. వీరిద్దరూ బావబామ్మర్దులు. కార్తీ తన అమాయకత్వం, ప్రేమతో అరవింద స్వామి నవ్విస్తూ, ఏడిపిస్తూ ఉంటాడు.