నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్, మణిరత్నం డిజాస్టర్ మూవీ థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

Published : Jul 03, 2025, 02:21 PM IST

లోక నాయకుడు స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ళ తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయింది.

PREV
15

లోక నాయకుడు స్టార్ కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ళ తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం దారుణంగా డిజాస్టర్ అయింది. కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మణిరత్నం అయితే దర్శకుడిగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.

25

థియేటర్స్ లో డిజాస్టర్ కావడంతో నెలరోజుల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలయింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

35

ఈ చిత్రానికి విడుదల ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, స్టార్ కాస్ట్ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించారు. అయితే విడుదలైన తర్వాత నెగటివ్ రివ్యూలు, మిశ్రమ స్పందన కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే ఆసక్తి నెలకొంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

45

ఇక ఓటీటీలో విడుదల విషయంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కథనాల ప్రకారం, థియేటర్ నుండి ఓటీటీకి సినిమాని ప్రదర్శించాలి అంటే ట్రాన్సిషన్‌ నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం థియేటర్ రిలీజ్, ఓటిటి రిలీజ్ కి 8 వారాల గ్యాప్ మైంటైన్ చేయాలి. కానీ ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటిటిలో రిలీజ్ కావడంతో నిర్మాతలు థియేటర్స్ కి 25 లక్షల పెనాల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం రూ. 135 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోగా, చివరికి ఈ డీల్ విలువ రూ. 110 కోట్ల వరకు తగ్గించబడినట్టు సమాచారం.

55

ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు త్రిష,  అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్లకి పైగా బడ్జెట్ లో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 90 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అనేది దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories