Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ

Published : Feb 11, 2026, 08:49 AM IST

వరుస పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్‌ మూవీ ఆగిపోయింది. దీంతో దర్శకుడు మారారు. కొత్త కథతో సినిమాని రూపొందించారు. ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ని కొట్టారు. ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటనేది చూస్తే. 

PREV
14
పాన్‌ ఇండియా హీరోగా రాణిస్తోన్న ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన లెక్కలు మారిపోయాయి. `దేవర`తో పాన్‌ ఇండియా హిట్‌ని అందుకున్నారు. కానీ `వార్‌ 2` తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ మూవీతో అంతా తలక్రిందులయ్యాయి. ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

24
ఎన్టీఆర్‌ని చూసి షాక్‌ అయిన రాజమౌళి

ఈ మూవీ తర్వాతనే కొత్త సినిమా అప్‌ డేట్స్ రాబోతున్నాయి. అయితే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది ఆగిపోయిందా? ఉందా అనేది క్లారిటీ లేదు. అలాగే `దేవర 2` చేయాల్సి ఉంది. ఎప్పుడు ఏ సినిమా చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే కెరీర్‌ బిగినింగ్‌ లో ఎన్టీఆర్‌ విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నాయి. `స్టూడెంట్‌ నెం 1` టైమ్‌లో దర్శకుడు రాజమౌళి.. తారక్‌ని చూసి వీడేంటి ఇలా ఉన్నాడని అనుకున్నాడట. ఎన్టీఆర్‌ లావుగా ఉండటంతో వీడు హీరోనా అని మనసులో అనుకున్నాడట. ఆ తర్వాత రియలైజ్‌ అయ్యాడు, ఇద్దరు కలిసి నాలుగు సినిమాలు చేశారు.

34
40 రోజుల షూటింగ్‌ తర్వాత ఆగిపోయిన ఎన్టీఆర్‌ మూవీ

ఇదిలా ఉంటే `స్టూడెంట్‌ నెం 1` తర్వాత తారక్‌కి హిట్‌ లేవు. వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి. దీంతో ఎలాగైనా మంచి సినిమా చేయాలని పవన్‌ శ్రీధర్‌ దర్శకత్వంలో దొరస్వామి రాజు ఓ సినిమాని నిర్మించారు. దాదాపు 40 రోజులు చిత్రీకరణ జరిపారు. ఔట్‌పుట్‌ చూసుకున్నాక సరిగా రాలేదట. ఇది ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి సెట్‌ అయ్యేలా లేదని చెప్పి ఆ సినిమాని పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళిని తీసుకొచ్చారు. ఆయన మరో కథని రెడీ చేశారు. అలా సేమ్‌ బ్యానర్‌లోనే ఎన్టీఆర్‌ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేశారు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అదే `సింహాద్రి`.

44
సింహాద్రితో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ హీరోగా, భూమిక, అంకిత హీరోహీరోయిన్లుగా నటించారు. దొరస్వామి రాజు, విజయ్‌ కుమార్‌ వర్మ నిర్మించారు. ఈ సినిమా ఓపెనింగ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2003 జులై 11న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రూ.8 కోట్లతో రూపొంది, రూ.33కోట్లు వసూలు చేసింది. వంద రోజులకుపైగా ఆడింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాతోనే కమర్షియల్‌ హీరోగా ఎదిగారు తారక్‌. స్టార్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక రకంగా `సింహాద్రి` మూవీ ఎన్టీఆర్‌ కెరీర్‌ కి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories