టాలీవుడ్ క్రేజీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సుమ, అనసూయ తర్వాత శ్రీముఖి యాంకర్ గా అంతటి గుర్తింపు సొంతం చేసుకుంది. శ్రీముఖి అప్పుడప్పుడు నటిగా కూడా రాణిస్తూనే ఉంది. అయితే శ్రీముఖికి నటిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టేలా పాత్రలు దక్కడం లేదు. బుల్లితెరపై మాత్రం యాంకర్ గా దూసుకుపోతోంది.
పలు టీవీ ఛానల్స్ లో శ్రీముఖి చేస్తున్న షోలు బాగా పాపులర్ అయ్యాయి. జీ తెలుగు ఛానల్ లో శ్రీముఖి సరిగమప అనే సింగింగ్ షోకి యాంకర్ గా చేస్తోంది. చలాకీగా ఉంటూ తనదైన శైలిలో చిలిపిదనం ప్రదర్శిస్తూ, జోకులు వేస్తూ ఈ షోని శ్రీముఖి సరదాగా నడిపిస్తోంది.