ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ:  ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిసి అడిగేశా..!

First Published Mar 13, 2021, 5:04 PM IST


దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా భారీ సక్సెస్ కొట్టారు. ఆయన నిర్మించిన జాతి రత్నాలు మూవీ రికార్డు వసూళ్లు రాబడుతుంది.  సతీమణి ప్రియాంక దత్ స్థాపించిన బ్యానర్ లో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు ఆయన. 
 

నాగ్ అశ్విన్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తెను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భిన్న నేపధ్యాలు కలిగిన వీరి మధ్య సినిమా మాద్యమంలా పని చేసి ప్రేమకు కారణం అయ్యింది.
undefined
మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కూతురైన ప్రియాంకా దత్... దర్శకుడుగా నాగ్ అశ్విన్ సక్సెస్ కాకముందే అతన్ని నమ్మింది. అసలు ప్రియాంక, నాగ్ అశ్విన్ ప్రేమ కథ ఎలా మొదలైంది అనేది అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్న.
undefined
ఓ సంధర్భంలో నాగ్ అశ్విన్ దీనిపై స్పందించారు. ప్రొఫెషనల్ గా ప్రియాంకతో ఎప్పటి నుండో నాగ్ అశ్విన్ కి పరిచయం ఉందట. కొన్ని యాడ్స్ కోసం వీరు కలిసి పనిచేశారట.
undefined
ఆ పరిచయంతోనే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి నిర్మాతగా ప్రియాంక దత్ వ్యవహరించారట. ఇక వీరి ప్రేమ కథ వ్యవహారానికి వస్తే.. చాలా సింపుల్ గా వీరి ప్రపోజల్ జరిగిందట.
undefined
ప్రియాంక దత్ కి పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో.. మీకు ఎవరైనా నచ్చితే ఓకె... లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారట నాగ్ అశ్విన్.
undefined
చాలా కాలంగా నాగ్ అశ్విన్ తో ట్రావెల్ చేస్తున్న ప్రియాంకకు అతని మంచి తనం గురించి తెలియడంతో ఓకె చెప్పారట.
undefined
అలా సింపుల్ గా ప్రపోజల్, తరువాత పెళ్లి జరిగిపోయాయని నాగ్ అశ్విన్ తెలిపారు.  ప్రియాంకతో పెళ్లి తరువాత  వీరి కాంబినేషన్ లో వచ్చిన మహానటి భారీ విజయాన్ని అందుకుంది. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంది.
undefined
ఇక నాగ్, ప్రియాంక పెళ్ళికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అందరూ హాజరయ్యారు. 2016లో వీరికి ఒక అబ్బాయి జన్మించడం జరిగింది.
undefined
click me!