Ilaiyaraaja Magic: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఓ అద్భుతం చేశారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన 'నాయకన్' సినిమా కోసం కట్టిన ఓ జోలపాట ట్యూన్ను... మాస్ మసాలా సాంగ్గా మార్చేశారు.
ఒక సినిమా కోసం కంపోజ్ చేసిన ట్యూన్లన్నీ అందులో వాడరు. కొన్నిసార్లు ట్యూన్ బాగున్నా, కథకు, సీన్కు సెట్ కాకపోతే పక్కన పెట్టేస్తారు. ఆ ట్యూన్ను మరో సినిమాలో వాడుకోవడం, అదే ట్యూన్కు కొత్త హంగులు అద్ది అదే సినిమాలో మరో పాటగా మార్చడం జరుగుతుంది. సినీ సంగీత చరిత్రలో ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. కానీ అవి తెరబయటే ఉండిపోతాయి. కానీ అలాంటి విషయాలు తెలిసినప్పుడు మాత్రం వాహ్ అనిపిస్తుంది. ఇలాంటివి మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లో చాలానే ఉన్నాయి.
25
నాయకన్ సినిమాలోని పాట మ్యాజిక్
ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఇళయరాజా కంపోజ్ చేసిన 'నిలా అదు వానత్తు మేలే' పాటకు కూడా ఉంది. 1987లో మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'నాయకన్' సినిమాలోని ఈ పాట అప్పట్లో పెద్ద హిట్. జనగరాజ్, కుయిలి ఈ పాటలో డ్యాన్స్ చేశారు. ఇప్పటికీ ఈ పాట యూత్ను ఊపేస్తూనే ఉంటుంది.
35
జోల పాటని మాస్ బీట్గా మార్చిన ఇళయరాజా
సినిమా కథ ప్రకారం, కమల్ హాసన్ మాదక ద్రవ్యాలను పడవలో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు తెలిసిపోతుంది. వాళ్లు వస్తున్నారని తెలియగానే, అవి ఉన్న మూటను ఉప్పుతో కలిపి సముద్రంలో పడేస్తాడు. ఈ టెన్షన్ సీన్ మధ్యలో, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు 'నిలా అదు వానత్తు మేలే' పాట వస్తుంది. ఇప్పుడు వింటుంటే పక్కా మాస్ బీట్ సాంగ్లా అనిపించే ఈ ట్యూన్, మొదట ఓ జోలపాట కోసం కట్టింది.
మెలోడీ సెట్ కావడం లేదని మాస్ బీట్గా మార్చిన ఇళయరాజా
ఈ విషయం గురించి ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'నాయకన్' సినిమాలోని 'తెన్పాండి సీమైయిలే' పాటకు బదులుగా వాడటానికి, మొదట ఈ ట్యూన్ను ఓ జోలపాటగా కంపోజ్ చేశారట. కానీ ఆ సీన్కు ఈ మెలోడీ సెట్ కాలేదు. దాంతో, అదే ట్యూన్కు వేరే మ్యూజిక్ ఇచ్చి, దాన్ని ఓ హుషారైన మాస్ సాంగ్గా మార్చామని ఇళయరాజా తెలిపారు. అలా ఈ ట్యూన్ 'నిలా అదు వానత్తు మేలే' పాటగా జనాల్లోకి వెళ్లింది.
55
క్లాసిక్గా నిలిచిన నాయకన్ మూవీ
ఒక జోలపాట ట్యూన్ నుంచి పుట్టి, మాస్ సాంగ్గా మారిన ఈ పాట 'నాయకన్' సినిమాకు ఓ మ్యూజికల్ హైలైట్గా నిలిచింది. ఒకే ట్యూన్ను ఇళయరాజా తన మ్యూజిక్తో సీన్కు తగ్గట్టు ఎలా పూర్తిగా మార్చేయగలరో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటించిన 'నాయకన్', వాళ్లిద్దరి కెరీర్లోనూ ఓ మైలురాయిగా, తమిళ సినిమా చరిత్రలో ఓ క్లాసిక్గా నిలిచిపోయింది.