K J Yesudas: ఇళయరాజా ఎంత బ్రతిమాలినా నో చెప్పిన యేసుదాస్.. మాస్టర్‌ పీస్‌గా నిలిచిన సాంగ్‌ వెనుక క్రేజీ స్టోరీ

Published : Mar 24, 2026, 07:39 PM IST

K J Yesudas: ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఒక పాట పాడటానికి యేసుదాస్‌కు పిలుపు వచ్చింది. అయితే, కంపోజింగ్‌కు ఆలస్యంగా వెళ్లిన యేసుదాస్, ఆ పాటను పాడటానికి నిరాకరించి వెనుదిరిగారు.  ఏం జరిగిందంటే? 

PREV
14
యేసుదాసు కోసం ఇళయరాజా వెయిటింగ్‌
తమిళ సినీ సంగీతంలో కొన్ని పాటలు కేవలం స్వరాలు కాదు, అవి ప్రాణం పోసుకుని శ్రోతల భావోద్వేగాలతో కలిసిపోతాయి. అలాంటి ఒక పాట పుట్టుక వెనుక కథ ఇది. ఆ రోజు ఇళయరాజా స్టూడియోలో అంతా సిద్ధంగా ఉంది. మ్యూజిషియన్స్ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అందరూ ఒకే ఒక్క గొంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ గొంతు మరెవరిదో కాదు, లెజెండరీ సింగర్ కే.జే. యేసుదాస్‌ది. కానీ సమయం గడుస్తున్నా, యేసుదాస్ రాలేదు.
24
యేసుదాసుని కాదని తానే స్వయంగా పాట పాడిన ఇళయరాజా

`సమయం వృథా అవుతోంది, ఒక ట్రయల్ చూద్దాం` అని ఇళయరాజా నిర్ణయించుకున్నారు. ఆయనే స్వయంగా ఆ పాట పాడి రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది.  ఎమెర్జెన్సీ వల్ల తాను రాలేకపోయినందుకు యేసుదాస్ విచారం వ్యక్తం చేశారు. మరుసటి రోజు స్టూడియోకి వచ్చిన యేసుదాస్‌కు, ఇళయరాజా  తాను పాడిన ట్రయల్ రికార్డింగ్‌ను ఇచ్చారు. `ఒకసారి విని సిద్ధంగా ఉండండి` అని చెప్పి వెళ్లారు ఇళయరాజా.

34
ఇళయరాజాకి నో చెప్పిన యేసుదాసు

పాట పూర్తిగా విన్న యేసుదాస్ కళ్లు చెమర్చాయి. ఆయన నేరుగా ఇళయరాజా దగ్గరకు వెళ్లి, `ఈ పాటను పాడటానికి నా మనసు రావడం లేదు. ఈ ఫీల్, ఈ డెప్త్ నేను ఇవ్వగలనో లేదో తెలియడం లేదు. ఈ పాట ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలంటే, అది మీ గొంతుతోనే సాధ్యం` అని చెప్పారు. ఇళయరాజా ఎంత బ్రతిమాలినా, ఆ పాట పాడటానికి యేసుదాస్ అంగీకరించలేదు.

44
మాస్టర్‌ పీస్‌గా నిలిచిన సాంగ్‌ ఇదే
అంతటి గొప్ప గాయకుడైనప్పటికీ, ఒక పాట సరైన గొంతుతో జీవించాలని యేసుదాస్ తనకు వచ్చిన అవకాశాన్ని ఇళయరాజాకు వదిలేశారు. ఆ రోజు ఇళయరాజా గొంతులోంచి ప్రపంచానికి పరిచయమైన ఆ పాటే... "జననీ జననీ జగం నీ, అగం నీ”. ఈ పాట 1982లో వచ్చిన 'తాయ్ మూకాంబికై' చిత్రంలోనిది. ఈ పాటను ఈ రోజు కళ్లు మూసుకుని విన్నా మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అంత ఆత్మార్థంగా ఇళయరాజా ఆ పాటను పాడారు. అందుకే అది ఒక మాస్టర్‌పీస్‌గా నిలిచిపోయింది.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories