Nagarjuna Dream Role: నాగార్జున డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? రాజమౌళిని భలే ఇరికించాడుగా

Published : Mar 24, 2026, 04:12 PM IST

నాగార్జున కమర్షియల్‌ హీరోగా రాణించారు. కొన్ని భక్తిరస చిత్రాలు కూడా చేశారు. విలక్షణ నటుడిగా రాణించారు. మరి ఆయన డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? నాగ్‌ స్వయంగా వెల్లడించారు. 

PREV
15
ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన నాగార్జున

నాగార్జునపై మన్మథుడు అనే ట్యాగ్‌ పడింది. కానీ ఆయన అన్నిరకాల పాత్రలు పోషించారు. ఇంకా చెప్పాలంటే ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచారు. `మన్మథుడు` చేసిన ఆయనే శ్రీరామదాసు మూవీ చేశారు. `అన్నమయ్య` చిత్రాలు చేసి మెప్పించారు. బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. కమర్షియల్ సినిమాలు ఆడటం లేదు. దీంతో విభిన్నమైన మూవీస్‌ వైపు ఫోకస్‌ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చేస్తున్నారు.

25
విలక్షణ నటుడిగా రాణిస్తోన్న నాగార్జున

నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం చేస్తున్నారు. `నాగ్‌ 100` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. సంక్రాంతి టార్గెట్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇదిలా ఉంటే నాగార్జున ఇటీవల క్రేజీగా టర్న్ తీసుకున్నారు. ఆయన విలన్‌గానూ చేయడానికి రెడీ అయ్యారు. `కూలీ` చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇది ఆడలేదు. అలాగే `కుబేరా` మూవీలో కీలక పాత్రలో నటించారు. ఇది ఫర్వాలేదనిపించింది.

35
నాగార్జున డ్రీమ్‌ రోల్స్

అంతేకాదు గతంలో `బ్రహ్మాస్త్ర`లోనూ కీలక పాత్రలో నటించారు. ఆయన నంది అస్త్రగా కనిపించారు. ఈ క్రమంలో నాగార్జునకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తన డ్రీమ్‌ రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగ్‌కి మైథాలజీ రోల్స్ చేయాలని ఉందట. అందులో భాగంగానే మహాభారతాన్ని సినిమాగా చేస్తే అందులో నటించాలని ఉందని తెలిపారు. 

45
మహాభారతంలో నటించాలని ఉంది

`పౌరాణిక సినిమా చేయాలని ఉంది. ఎన్టీఆర్‌ గారు కృష్ణుడు, అర్జునుడుగా నటించారు. కానీ ఇంకా చాలా పౌరాణిక పాత్రలు చాలా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక పాత్రని తీసుకొని ఎవరైనా పక్కా కథతో వస్తే నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను` అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ, ఎన్టీఆర్‌, నాన్నగారు చేసిన పౌరాణికాలు చూస్తూ పెరిగాను. అలాంటి సినిమాలు ఎవరైనా చేస్తే నటించాలని ఉంది. ఇప్పుడు రాజమౌళి పెద్ద బడ్జెట్‌ చిత్రాలు చేస్తున్నారు. అలా ఎవరైనా మహాభారతం లాంటివి తీస్తే చేయాలని ఉంది. మహాభారతంలో ఏ పాత్ర అయినా చేయాలని ఉంది. ఇలాంటి సినిమా అంటే ముగ్గురు, నలుగురు హీరోలు కావాలి, ఎవరైనా ప్లాన్‌ చేస్తే బాగుంటుంది` అని చెప్పారు నాగార్జున. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

55
రాజమౌళి ని ఇరికించిన నాగార్జున

ప్రస్తుతం తెలుగులో మైథాలజీ సినిమాలు చేసే వారిలో రాజమౌళి ముందు వరుసలో ఉన్నారు. `బాహుబలి` చిత్రంతో ఆ జోనర్‌ని టచ్‌ చేశారు. ఇప్పుడు ఆయన `వారణాసి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రామాయణం ఎపిసోడ్‌ని తీస్తున్నారు. మహేష్‌ బాబు రాముడిగా కనిపించబోతున్నారు. ఆ తర్వాత మహాభారతం చేయబోతున్నారు. మహాభారతం చేయాలనేది తన డ్రీమ్‌ అని వెల్లడించారు రాజమౌళి. మరి నాగార్జున ఎప్పుడో రాజమౌళి కి హింట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పుడు నాగార్జునని పౌరాణిక పాత్రల్లో చూపించడమనేది రాజమౌళి చేతుల్లో ఉందని చెప్పొచ్చు. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories