చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - అనన్య పాండే జంటగా నటించారు. మూవీ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.