ఆ తెలుగు స్టార్‌ జంట గర్భం దాల్చలేదు.. సరోగసి ద్వారానే పిల్లలు కన్నారు.. వేణు స్వామి సంచలన ఆరోపణలు

First Published Apr 10, 2024, 10:43 AM IST

వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్టార్‌ సెలబ్రిటీ జంట సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారంటూ బాంబ్‌ పేల్చాడు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
 

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ వార్తలు నిలుస్తూ వచ్చాడు. కెరీర్‌ గురించి, డౌన్ ఫాల్‌గురించి, పెళ్లిళ్లు, పెటాకులు అంటూ హాట్‌ కామెంట్లతో దుమారం రేపుతున్నాడు. ఇలా సంచలన, వివాదాస్పద జ్యోతిష్యుడిగా మారిపోయాడు వేణు స్వామి. సినిమా సెలబ్రిటీలే కాదు, రాజకీయ నాయకులు జాతకాలు కూడా చెబుతూ చర్చనీయాంశంగా మారుతున్నాడు. 
 

వేణు స్వామి టార్గెట్ ఎక్కువగా సినిమా సెలబ్రిటీలే కావడం గమనార్హం. వారి గురించి చెబితేనే త్వరగా ఫేమస్‌ కావొచ్చు అనేది ఆయన ప్లాన్‌. ఆ రకంగానే బాగా ఫేమస్‌ అయ్యాడు, దానికి తగ్గట్టుగానే బాగానే కూడబెట్టుకున్నారనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. కెరీర్‌ బాగాలేని హీరోయిన్లు కూడా ఆయన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం గమనార్హం. 
 

Venu Swamy

తరచూ స్టార్‌ హీరోలు, హీరోయిన్ల జాతకాలను తెరపైకి తెస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతుంటారు. తాజాగా ఉగాది సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకి సంబంధించిన కొన్ని ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను బయటపెట్టాడు వేణు స్వామి. ముఖ్యంగా సెలబ్రిటీల సంతానం గురించి బాంబ్‌ పేల్చాడు. ఇవి షాకింగ్‌ నిజాలు అంటూ యూట్యూబ్‌ ఛానెల్‌లో రెచ్చిపోయాడు. 
 

సెలబ్రిటీల సంతానంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. నయనతార ప్రస్తావన తెచ్చి.. ఆమె అందం కోసం గర్భం దాల్చలేదనేది అబద్దమని, ఆమెకి సంతానం అయ్యే భాగ్యం లేదని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ఓ టాలీవుడ్‌ సెలబ్రిటీ జంటపై కూడా సంచలన ఆరోపణలు చేశాడు. సెలబ్రిటీలు గర్భం పేరుతో మోసం చేస్తున్నారని, వారంతా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 

`హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే ఇద్దరు సెలబ్రిటీలు, లాస్ట్ వన్‌, టూ ఇయర్స్ లో పిల్లల్ని కన్న ఇద్దరు సెలబ్రిటీలు కూడా సరోగసి ద్వారానే బిడ్డకి జన్మనిచ్చారు` అంటూ బాంబ్‌ పేల్చాడు వేణు స్వామి. వాళ్లు గర్భం దాల్చారనేది వాస్తవం కాదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారని, వాళ్లు గర్భం దాల్చారనేది వాస్తవం కాదన్నారు. 
 

గర్భం దాల్చిన మహిళ గర్భం, డెలివరీ టైమింగ్‌ని బట్టి ఈ సెలబ్రిటీలు గర్భం దాల్చినట్టు ప్లాన్‌ చేస్తున్నారని, ఆ మహిళ డెలివరీ టైమ్‌కి ఆసుపత్రికి వెళ్లి, వీరే పిల్లల్ని కన్నట్టు సినిమాటిక్‌ డ్రామా క్రియేట్‌ చేసి పిల్లలతో బయటకు వస్తున్నారని, అదంతా ఫేక్‌ అని వెల్లడించారు. వారి పేర్లు తాను చెప్పను అని, చెబితే పెద్ద రచ్చ అవుతుంది, వాళ్ల మీద పడి ఏడవడం అవుతుందన్నారు వేణు స్వామి. క్యూబ్‌ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాలను వెల్లడించారు.
 

Ram Charan - Upasana

దీంతో ఆ పెద్ద సెలబ్రిటీలు ఎవరు అని వెతికే పనిలో నెటిజన్లు ఉన్నారు. ఇటీవల పిల్లల్ని కన్నవారిలో రామ్‌ చరణ్‌, ఉపాసన జంట ఉన్నారు. నిఖిల్‌, యంగ్ హీరో సుహాస్‌ తండ్రి అయ్యారు. వీళ్లల్లో ఎవరు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. అయితే వీరిలో కూడా ఫిల్టర్‌ చేసి ఆ పెద్ద సెలబ్రిటీలే అంటూ గుసగుసలు స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఏదేమైనా వేణు స్వామి పెట్టిన ఈ మంట నెమ్మదిగా టాలీవుడ్‌లో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. 

click me!