థామా, కే ర్యాంప్‌, డ్యూడ్‌, తెలుసు కదా బాక్సాఫీసు కలెక్షన్లు.. దుమ్ములేపుతున్న మూవీ ఏంటంటే?

Published : Oct 22, 2025, 02:39 PM IST

Diwali Box Office: ఈ దీపావళి పండుగని పురస్కరించుకుని ఐదు సినిమాలు వచ్చాయి. `థామా`, `కే ర్యాంప్‌`, `తెలుసు కదా`, `డ్యూడ్‌` చిత్రాల్లో ఏ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. 

PREV
15
దీపావళి సినిమాల బాక్సాఫీసు కలెక్షన్లు

దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ సారి దాదాపు ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు తెలుగు సినిమాలుండగా, ఒకటి తమిళం, మరోటి హిందీ చిత్రం ఉంది. గత వారం `మిత్ర మండలి`, `తెలుసు కదా`, `డ్యూడ్‌`, `కే ర్యాంప్‌` చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. వీటిలో `మిత్ర మండలి` ఫస్ట్ షో నుంచే డిజాస్టర్‌గా మిగిలింది. సిద్ధు జొన్నలగడ్డ `తెలుసుకదా` ఏమాత్రం మెప్పించలేకపోయింది. ప్రదీప్‌ రంగనాథన్‌ `డ్యూడ్‌` తమిళంలో దుమ్ములేపుతుంది. కిరణ్‌ అబ్బవరం `కే ర్యాంప్‌` మాత్రం బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఇక తాజాగా రష్మిక మందన్నా `థామా` మూవీ మంగళవారం విడుదలైంది. మరి ఈ మూవీస్‌ బాక్సాఫీసు వసూళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

25
రష్మిక `థామా` ఫస్ట్ డే క్రేజీ కలెక్షన్లు

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ `థామా`. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ విలన్‌గా నటించారు. మడాక్‌ హర్రర్‌ కామెడీ సినిమా యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. మడాక్‌ ఫిల్మ్స్ నిర్మించింది. దీపావళి పండగని పురస్కరించుకుని మంగళవారం విడుదలైన ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నార్త్ లో మిశ్రమ స్పందన లభించింది. కాకపోతే ఫస్ట్ డే భారీ అంచనాల మధ్య విడుదలైంది. దీంతో కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపింది. ఈ చిత్రం ఇండియాలో రూ.25.11కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.35కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.

35
కిరణ్‌ అబ్బవరం `కే ర్యాంప్‌` ర్యాంపేజ్‌

దీపావళి పండగ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో కిరణ్‌ అబ్బవరం `కే ర్యాంప్‌` కూడా ఉంది. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం శనివారం విడుదలైంది. నాలుగు రోజుల్లో ఇది సుమారు రూ. 20కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇది దాదాపు పది కోట్లకుపైగా షేర్‌ సాధించింది. ఇప్పటికే ఇది బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి వెళ్లింది. తెలుగులో `కే ర్యాంప్‌` దీపావళి విన్నర్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

45
డల్‌గా సాగుతున్న `తెలుసు కదా`

ఇక దీపావళి పండగా సందర్భంగా విడుదలైన మరో తెలుగు మూవీ `తెలుసు కదా`. సిద్ధు జొన్నలగడ్డ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ కోన దర్శకత్వం వహించారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.12కోట్లు రాబట్టింది. ఈ మూవీకి అయిన బిజినెస్‌ రూ.23 కోట్లు. ఇప్పుడు ఆరు కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.17కోట్లు రావాలి. ఈ మూవీకి మంగళవారం నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చూడబోతుంటే ఇది డిజాస్టర్‌గా నిలవబోతుందనిపిస్తోంది.

55
వంద కోట్లకి చేరువలో `డ్యూడ్‌`

దీపావళి కానుకగా విడుదలైన మరో మూవీ `డ్యూడ్‌`. కోలీవుడ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించారు. మమితా బైజు హీరోయిన్‌గా చేసింది. కీర్తిశ్వరన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఐదు రోజుల్లో ఇది సుమారు రూ.95కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రం రూ.13కోట్లు రాబట్టింది. మంగళవారం వసూళ్లు బాగా పడిపోయాయి. అయితే తమిళంలో బాగా ఆడుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. తెలుగులో ఈ చిత్రానికి వ్యాపారం విలువ పది కోట్లు. ఇంకా నాలుగు కోట్లు షేర్‌ రావాల్సి ఉంది. అంటే ఏడు కోట్ల గ్రాస్‌ రావాలి. చూడబోతుంటే అది కష్టమనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories