Sobhita Dhulipala
ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల హాలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసింది. ఆమె కెరీర్ హిందీ చిత్రాలతో మొదలైంది. మోడల్ అయిన శోభిత మొదటి చిత్రం రామన్ రాఘవన్ 2.0. ఈ మూవీ 2016లో విడుదలైంది.
హీరో అడివి శేషు ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశారు. స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో అడివి శేషుకు జంటగా శోభిత ధూళిపాళ్ల నటించింది. గూఢచారి సూపర్ హిట్ అందుకుంది. అలాగే మేజర్ మూవీలో శోభిత ఒక కీలక రోల్ చేసింది.
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో శోభిత ధూళిపాళ్ల నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించారు. శోభిత ధూళిపాళ్ల పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది.
శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్. ఈ చిత్రంలో శోభిత వేశ్య పాత్ర చేయడం విశేషం. సాధారణంగా ఈ తరహా రోల్ చేయడానికి హీరోయిన్స్ సాహసించరు. అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే వేశ్యలుగా వెండితెరపై కనిపించారు. మంకీ మ్యాన్ మూవీలో శోభిత పాత్ర పేరు సీత.
మంకీ మ్యాన్ చిత్రంలో వేశ్య పాత్ర చేయడం పై శోభిత ధూళిపాళ్ల స్పందించారు. మంకీ మ్యాన్ మూవీలో సీత అనే వేశ్య పాత్ర చేయడం గౌరవంగా ఉంది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యూఎస్ ఆడియన్స్ నా పాత్రను చాలా ఎంజాయ్ చేశారు. ఇండియన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా... అన్నారు.
మంకీ మ్యాన్ మూవీ ఏప్రిల్ 5న యూఎస్ లో విడుదల చేశారు. ఏప్రిల్ 26న ఇండియాలో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం కోసం శోభిత దూళిపాళ్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
మరోవైపు హీరో నాగ చైతన్యతో శోభిత ఎఫైర్ లో ఉన్నారనే వాదన ఉంది. వీరిద్దరూ కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు.