కీరవాణి సంగీతం ఇవ్వడానికి ఇది "నాటు నాటు" పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం ఇదని అన్నారు . అందెశ్రీ గీతం ఒక రణ నినాదం, ధిక్కార స్వరం అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్ తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించిందని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు ఆ ట్యూన్ మార్చే సాహసం చేస్తున్నారని ప్రశ్నించారు.