Jabardasth
జబర్దస్త్ కి ఒకప్పుడు ఉన్నంత ఆదరణ లేదు. స్టార్స్ నిష్క్రమణతో ప్రాభవం కోల్పోయింది. ఒకప్పుడు జబర్దస్త్ టాప్ రేటెడ్ షో. అనసూయ, నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది షోకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు వారెవరూ లేరు. చాలా మంది కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు.
Jabardasth
అయితే పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. శక్తిమేర నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఒకడు. అతడు చాలా కాలంగా జబర్దస్త్ కమెడియన్ గా, టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు సునామీ సుధాకర్ ఆయన టీమ్ లో ఉండేవాడు. ప్రస్తుతం ఫైమా, పొట్టి నరేష్ తో స్కిట్స్ చేస్తున్నాడు.
బుల్లెట్ భాస్కర్ ఈ మధ్య సమకాలీన పరిస్థితులు, సంఘటనల ఆధారంగా స్కిట్స్ రాసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంఘటనలు తన స్కిట్స్ లో కామెడీగా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఎంటైర్ స్కిట్ కొన్ని వార్తల నేపథ్యంలో నడిపిస్తున్నాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ పర్ఫార్మ్ చేసిన ఓ స్కిట్ హాట్ టాపిక్ అయ్యింది.
extra jabardasth promo
కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో ఓ ఇల్లీగల్ వ్యవహారం సంచలనం రేపింది. మోడల్ అండ్ యాక్టర్ అయిన ఓ వ్యక్తి.. భార్య, కూతురుని దూరం పెట్టాడు. మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఫ్లాట్ లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య కూతురితో పాటు ఆ ఫ్లాట్ ఎదుట బైఠాయించింది. నాకు న్యాయం చేయాలని మీడియాలో కోరుకుంది.
ఈ ఉదంతాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించాడు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఫైమా, పొట్టి నరేష్ స్కిట్ లో ఎప్పటిలాగే నవ్వులు పూయించారు. వాస్తవంగా జరిగిన ఇల్లీగల్ ఎఫైర్ ఉదంతాన్ని స్కిట్ రూపంలో బుల్లెట్ భాస్కర్ చక్కగా ప్రజెంట్ చేశాడు. అయితే ఇలాంటి స్కిట్స్ వలన రిస్క్ కూడా ఉంటుంది.
Mahesh Babu
గతంలో జబర్దస్త్ కమెడియన్స్ హాస్యం కోసం చేసిన కామెంట్స్, గెటప్స్ వివాదాస్పదం అయ్యాయి. హైపర్ ఆది పంచ్ లపై నిరసనలు వ్యక్తం కాగా పలుమార్లు క్షమాపణలు చెప్పాడు. బలగం డైరెక్టర్ వేణు మీద గౌడ సామాజిక వర్గం దాడి చేసింది. గీత కార్మికుల మీద జోక్స్ వేస్తూ ఆయన చేసిన స్కిట్ వివాదానికి దారితీసింది .