సుశాంత్ కేసు దర్యాప్తు: సైకలాజికల్ ఆటోప్సీ అంటే ఏమిటి?

First Published Aug 25, 2020, 11:18 AM IST

కేసులోకి ఎంటర్ అయిన సిబిఐ విచారణను వేగవంతం చేసింది. సుశాంత్ మరణం వెనకున్న కారణాలను తెలుసుకునేందుకు సిబిఐ సైకలాజికల్ ఆటాప్సీ ని నిర్వహించనుందని తెలిపింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అది ఆత్మహత్య కాదు హత్య అని వాదించేవారు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుశాంత్ వంటి హాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేసి దేశవ్యాప్తంగా మద్దతు కూడాకట్టారు. వారి డిమాండ్ కి తగ్గట్టుగానే సుప్రీం సైతం సిబిఐ విచారణకు అనుమత్చ్చింది.
undefined
ఇక ఈ కేసులోకి ఎంటర్ అయిన సిబిఐ విచారణను వేగవంతం చేసింది. సుశాంత్ మరణం వెనకున్న కారణాలను తెలుసుకునేందుకు సిబిఐ సైకలాజికల్ ఆటాప్సీ ని నిర్వహించనుందని తెలిపింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ ఈ ఆటాప్సీని నిర్వహించనుంది.
undefined
ఆటాప్సీ అంటే పోస్టుమార్టం. సాధారణంగా శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. మరి ఈ సైకలాజికల్ ఆటాప్సీ అంటే ఏమిటనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. సైకలాజికల్ ఆటాప్సీ అంటే సింపుల్ గా చెప్పాలంటే సుశాంత్ మెదడుకు జరిపే పోస్టుమార్టం.
undefined
సుశాంత్ మరణానికి కారణాన్ని కనుగొనేందుకు ఈ పరీక్షను నిర్వహించనుంది సిబిఐ. ఇందు కోసం సుశాంత్ శవాన్ని తవ్వి తీయరు. సుశాంత్ఆలోచనలను మాత్రమే తవ్వి తీస్తారు. ఇందుకోసం ఇప్పుడు వారు చాలా సమాచారాన్ని సేకరించవలిసి ఉంటుంది.
undefined
సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్ ను పూర్తి క్షుణ్ణంగా స్టడీ చేస్తారు. సుశాంత్ బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. సుశాంత్ మెడికల్ రికార్డు ని పరిశీలిస్తారు. సుశాంత్ కు సంబంధించిన అన్ని కోణాల్లోనూ ఈ సమాచారాన్ని సేకరిస్తారు. సుశాంత్ ఉదయం నిద్ర లేచిన దగ్గరినుండి రాత్రి పడుకునే వరకు ఎలా ఉండేవాడు అనే సమాచారాన్ని రాబడతారు. ముఖ్యంగా మరణానికి కొన్ని రోజులముందునుండి ఎలా ఉంటున్నాడు అనే సమాచారాన్ని సేకరిస్తారు.
undefined
ఇలా సమాచారాన్ని సేకరించిన తరువాత వీటిని ఒకదానితో మరొక దాన్ని పోల్చి చూసుకుంటూ ఒక నిర్ణీత పాటర్న్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో ఈ సమాచారాన్ని పోల్చి చూసి ఒక అంచనాకు వస్తారు.
undefined
ఇలా అన్నిటిని పరిశీలించి, సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో విషయాలతో కూడా పోల్చి చూసుకొని, ఇది హత్యా, ఆత్మహత్యా అనే నిర్ణయానికి వస్తారు. దేశంలో సైకలాజికల్ ఆటాప్సీ ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే చేసారు. సునంద పుష్కర్ మృతి విషయంలో ఒకసారి, మరోసారి బురారీ ఆత్మహత్యల కేసుల్లో మాత్రమే చేసారు. సుశాంత్ కేసు మూడవది.
undefined
ఇక సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ ఇప్పటికే తమ పనిని ప్రారంభించినట్టుగా తెలియవస్తుంది. సుశాంత్ శవాన్ని తొలిసారి చూసిన సిద్ధార్థ్ పఠానిని సుశాంత్ ఇంటికి తీసుకెళ్లి సీన్ ని రి క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పటివరకు రియా చక్రవర్తిని సిబిఐ విచారణకు హాజరుకావాలని ఆదేశాలివ్వలేదు. త్వరలో రియాను సైతం సిబిఐ విచారించనుంది.
undefined
click me!