ఈ నూతన బోర్డులో మెగా కుటుంబానికి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు సభ్యురాలిగా చోటు కల్పించడం అందరిని ఆశ్చర్చపరిచింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయిన సురేఖ కొణిదెల పేరును సభ్యుల జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, సురేఖ కొణిదెల, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఎం. రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్ (ది ఫౌండర్ ట్రస్టీ)లకు అవకాశం కల్పించారు.