మోహన్ బాబు తనలో దాగున్న ఆవేదనని బాలకృష్ణకి మాత్రమే చెప్పారు. తాను చేసిన పెద్ద తప్పు విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తిట్టారు అని కూడా మోహన్ బాబు ప్రస్తావించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు కోసం రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, స్వర్గీయ ఎన్టీఆర్ మధ్య కూడా ఎంతో మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు ఎన్టీఆర్ తో కలసి నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం అతడి కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ అనే చెప్పాలి.
25
మోహన్ బాబుకి బాలయ్య ప్రశ్న
ఎన్టీఆర్ పిలుపు మేరకు మోహన్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో జరిగిన ఒక సంఘటనని, తన బాధని మోహన్ బాబు బాలకృష్ణ ముందు మాత్రమే బయటపెట్టారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య మోహన్ బాబుని ఇలా ప్రశ్నించారు. అన్నగారి పార్టీని వదిలేసి వేరే పార్టీలో ఎందుకు జాయిన్ కావలసి వచ్చింది అని బాలయ్య అడిగారు. మోహన్ బాబు సమాధానం ఇస్తూ మన కెరీర్ లో కానీ, ఫ్యామిలీ లైఫ్ లో కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది.
35
ఎన్టీఆర్ కి ద్రోహం చేసినట్లే
చంద్రబాబు మాట విని అన్నయ్యని కాదనుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా స్నేహితుడు రజినీకాంత్ చెన్నై నుంచి వచ్చి నన్ను తిట్టారు. ఏరా ఇలా చేయడం అన్నయ్యకి ద్రోహం చేసినట్లే కదరా అని అడిగాడు. రజినీకాంత్, నేను కలసి అన్నయకి క్షమాపణ చెప్పాలని వెళ్లాం. నేను క్షమాపణ చెప్పేలోపే.. ఏం బ్రదర్ మీరు కూడా ద్రోహం చేస్తారా అని అడిగారు. ఆ మాటతో నా మనసు ముక్కలైంది. అన్నయ్య ముందు ఏమీ మాట్లాడలేకపోయాను అని మోహన్ బాబు అన్నారు. ఆ విధంగా బాధపడుతూనే అన్నగారిని కలసి వెనక్కి వచ్చేశాం.
ఆ తర్వాత చంద్రబాబు నా విషయంలో తప్పు చేశారు. క్రమశిక్షణ లేదని నన్ను పక్కన పెట్టేశారు అని మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు తిరిగి బాలయ్యని వివాదాస్పద ప్రశ్న అడిగారు. అన్నగారి తర్వాత పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావు అని అడిగారు.
55
పార్టీ పగ్గాలు అందుకే నేను తీసుకోలేదు
బాలకృష్ణ సమాధానం ఇస్తూ.. ఆ టైంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇలా వారి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నాం. ఆ టైంలో నేను వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టడం కరెక్ట్ కాదు అని అనిపించినట్లు బాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు కూడా గ్రామస్థాయి నుంచి రాజకీయాలపై అవగాహన పెంచుకుని ఈ స్థాయికి ఎదిగారు అని తెలిపారు.