Ennenno Janmala Bandham: వేదని అవమానించిన మాళవిక.. యాష్, వేదని కలపాలి అనుకుంటున్న సులోచన, మాలిని?

First Published Dec 13, 2022, 2:09 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈ రోజు ఎపిసోడ్లో మాళవిక, వేద ఇప్పటికీ నువ్వు ఖుషికి తల్లి గానే మిగిలిపోతావు. యశోదర్ కి మాత్రం భార్యవి కాలేవు వేద. బిడ్డలు కనలేని నువ్వు ఒక ఆడదానివా, కాపురం చేయని మీరు భార్యాభర్తల మీ ఇద్దరి బంధం త్వరలోనే బయటపెడతాను అనే మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు సులోచన మాలిని ఇద్దరు వింటూ ఉంటారు. యష్ ని నీకు దక్కకుండా చేస్తాను వేద అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఆ మాటలు విన్న సులోచన మాలిని, యష్ లు షాక్ అవుతారు. ఆ తరువాత మాలిని, సులోచన ఇద్దరూ సాంబ్రాణి ధూపం వేస్తూ ఒకరితో ఒకరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
 

అప్పుడు వారిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వారి భర్తలు అక్కడికి రావడంతో వాళ్లను కూడా మధ్యలో ఇన్వాల్వ్ చేస్తూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు మాలిని,సులోచన. తర్వాత జరిగిన విషయాలు తలుచుకుని వేద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మాళవిక అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మేమిద్దరము ఒక కండిషన్ ప్రకారం పెళ్లి చేసుకున్నాము అలాంటిది ఎవరు ఏదో అంటే ఎందుకు బాధపడాలి అనుకుంటూ ఉంటుంది వేద. మరొకవైపు  మాళవిక ఒక మనిషిలా కాకుండా ఒక మృగంలా ప్రవర్తించింది.

వేదని మాటలు అన్నా కూడా వేద  మౌనంగా ఉండిపోయింది అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వేద నాకు పిల్లలు పుట్టరు అని తెలిసే కదా నా కడుపున పుట్టని కూతురిని నా గుండెలపై పెట్టుకుని చూసుకుంటున్నాను, తల్లి ప్రేమను పంచుతున్నాను బిడ్డ ప్రేమను చవి చూస్తున్నాను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది వేద. మరోవైపు యష్ నేను ఎంత స్వార్ధపరుడని ఎంతసేపు నా కొడుకు గురించి ఆలోచించాను కానీ ఎటువంటి సంబంధం లేని వేద నా కొడుకు గురించి ఆలోచించి తనని క్షమించింది అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు.
 

అలా వారిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు మాలిని సులోచన వాళ్ళందరూ కలిసి యష్ వేదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనుషులు కలిసారని సంతోషపడ్డాము కానీ మనసులు కలవలేదని మనకేం సులోచన అని బాధపడతాడు సులోచన భర్త. అప్పుడు రత్నం వైఫ్ అండ్ హస్బెండ్ గా వారి మధ్య బంధం బాగోలేదని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మాలిని అని అంటాడు. అప్పుడు వారందరూ కలిసి వేదా యష్ ని ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటారు. తరువాత వేద అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది.

అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రావడంతో మాలిని, రత్నం కి మాట్లాడు అని సైగ చేస్తుంది. అప్పుడు మీ అమ్మకు మంచి మంచి ఐడియాలు వస్తాయి అని అనగా ఏంటి నాన్న అది అనడంతో వెంటనే మాలిని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రదేశం కి వెకేషన్ కి వెళ్తే బాగుంటుంది కదా అని అనగా సూపర్ గా ఉంటుంది అని అంటాడు యష్. ఇప్పుడు వేద కూడా నాక్కుడా బాగా నచ్చింది అని అంటుంది. అంత మాట్లాడిన తర్వాత మీరిద్దరూ హ్యాపీగా వెకేషన్ కి వెళ్ళిరండి మేము అన్ని చూసుకుంటాము అనడంతో వారిని రత్నం ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

మేము వెళ్లడం ఏంటి యష్ అనడంతో వెకేషన్ మీరే కదా అమ్మ ప్లాన్ చేశారు అని అంటాడు. రత్నం వెకేషన్ కు వెళ్లడానికి మేము ప్లాన్ చేశాము కానీ వెళ్ళేది మేము కాదు నువ్వు వేద అనడంతో వేద, యష్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికే మీరిద్దరూ చాలా లేట్ చేశారు ఇద్దరి కలిసి ఎక్కడికైనా వెకేషన్కు వెళ్లేసి రండి అని అంటారు మాలిని,రత్నం. అప్పుడు వేద, యష్ ఇద్దరూ ఆలోచనలో పడతారు. ఇప్పుడు కుదరదు బిజీ అని చెబుతారు యష్,వేద. తర్వాత మాలిని సులోచన దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఒప్పుకోవడం లేదు సులోచన అని అంటుంది మాలిని.
 

 ఇద్దరు బిజీగా ఉండడం వల్ల వెళ్లడం కుదరదు అని చెప్పారు అని అంటుంది. అలా అయితే ఒకటి పరిష్కారం వీరిద్దరిని కలిపి మా అమ్మ నాన్నల దగ్గరికి పంపించాలి అని అంటుందిసులోచన. అప్పుడు మాలిని వెటకారంగా మాట్లాడడంతో వెంటనే సులోచన తన అమ్మానాన్నల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. అప్పుడు సులోచన వాళ్ళ అమ్మని చూసి నాన్న సైగలు చేయగా వాళ్ళ అమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది. వయసు పెద్దదే అయినా చాలా టీనేజ్ వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు అని సులోచన పొగుడుతూ చెప్పడంతో మాలిని వావ్ అని అంటుంది. సులోచన అమ్మకు నాన్న తల దువ్వుతూ ఉంటాడు. వారిద్దరు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.

click me!