దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రభాస్ ప్రశంసల వర్షం.. ఆసక్తికరంగా రిప్లై ఇచ్చిన రాజమౌళి!

First Published Dec 13, 2022, 1:56 PM IST


దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్న జక్కన్న దర్శకత్వ ప్రతిభనూ కొనియాడుతున్నారు. ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తున్నందుకు గర్విస్తున్నారు.  
 

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫామెన్స్ కు కూడా వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్నారు. మరోవైపు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇదేగాక, ‘ఆర్ఆర్ఆర్’కు పలు ఫిల్మ్ క్రిటిక్ అసోషియేషన్ల నుంచి పలు అవార్డులు దక్కుతున్నాయి. మరోవైపు ఆస్కార్ విన్నింగ్ బరిలోనూ నిలిచింది. 
 

ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’కు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023 (Golden Globes)కి గాను రెండు నామినేషన్లను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు మరియు ఉత్తమ దర్శకుడిగా LA ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు (రన్నరప్) గెలుచుకున్నారు రాజమౌళి. వాటి తర్వాత SS రాజమౌళి తాజాగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు (రన్నరప్)ను సొంతం చేసుకున్నారు. మరోవైపు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ ఎంఎం కీరవాణికి అవార్డు దక్కింది. 
 

ఈ సందర్భంగా రాజమౌళిని కొనియాడుతూ అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్వీటర్, ఇన్ స్టా వేదికన జక్కన అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని పొందుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రభాస్ ట్వీట్ చేస్తూ.. ‘రాజమౌళి ప్రపంచాన్ని జయించబోతున్నారు.   గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్’లో ఆర్ఆర్ ఆర్ రెండు నామినేషన్లను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎంఎం కీరవాణి గారు LA ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ద్వారా అవార్డు పొందడం గర్వంగా ఉంది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.’ అంటూ సోషల్ మీడియాలో ద్వారా పేర్కొన్నారు. దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ.. ‘ఈ అంతర్జాతీయ గుర్తింపును నాకంటే ముందే నువ్వు నమ్మావు డార్లింగ్. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. 

రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్ లో ‘బాహుబలి’ రెండు భాగాలు గా వచ్చిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ హ్యయేస్ట్ గ్రాసింగ్  ఇండియన్ ఫిల్మ్ గా నిలిచిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే తరహాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్ లో రానున్న అడ్వేంచర్ ఫిల్మ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 

click me!