వచ్చే ఏడాది శృతి హాసన్ దే హవా.. తొలిసారిగా చిరు, బాలయ్య, ప్రభాస్ సరసన.. ఎవరితో కలిసి వస్తుందో?

First Published Dec 20, 2022, 1:06 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఇండస్ట్రీలో ఆసక్తికరంగా దూసుకుపోతోంది. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఏ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
 

లోకనాయకుడు, తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ శృతి హాసన్. కానీ, ఇండస్ట్రీలో మాత్రం తన సొంత టాలెంట్ తోనే ఎదిగిందనే విషయం తెలిసిందే. 13 ఏండ్లుగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ సౌత్, నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. 
 

అయితే కొన్నాళ్లుగా శృతి హాసన్ కు సరైన హిట్టు పడ్టటం లేదు. స్టార్ హీరోయిన్ గా ఎదిగినా ఆ స్థాయి సినిమాలు దక్కలేనే చెప్పాలి. గతేడాది ‘క్రాక్’, అంతకు ముందు ‘సింగం 3’తో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత, ముందు వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో భారీ ప్రాజెక్టు లు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో సందడి చేయబోతోంది. వాటిలో ఏ చిత్రం ఈమెకు కలిసి వస్తుందనేదనేది ఆసక్తికరంగా మారింది. 
 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - శృతి హాసన్  జంటగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో శృతి హాసన్ సరికొత్తగా కనిపిస్తోంది. చిరు సైతం వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్ తో చిరు - శృతి హాసన్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అవుతుందనిపిస్తోంది.
 

శృతి హాసన్ నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). ‘అఖండ’ బ్లాక్ బాస్టర్ తర్వాత నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న చిత్రమిది. గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య - శృతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న ఈ యాక్షన్ ఫిల్మ్ విడుదల కానుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతుండటంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. బాలయ్య - శృతి జంట కూడా క్రేజీగా కనిపిస్తోంది. 

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ ‘సలార్’ (Salaar). పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్నారు. డార్లింగ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లలో ఇదోకటి. ఈ చిత్రం కూడా వచ్చే ఏఢాది సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. 

ఇలా శృతి హాసన్ నటించిన మూడు అవైటెడ్ సినిమాలు వచ్చే ఏఢాదే రిలీజ్ కాబోతుండటం విశేషం. మరోవైపు చిరు, బాలయ్య, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన కూడా శృతి హాసన్ నటించడం ఇదే మొదటిసారి. వీరలో ఎవరితో మెప్పిస్తుందనే ఆసక్తికరంగా మారింది. మూడు ప్రాజెక్టులపైనా భారీ అంచనాలనే నెలకొనడంతో శృతి హాసన్ మళ్లీ రేసులోకి రాబోతుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో ఇండస్ట్రీని ఏలుతుందని అభిమానులూ అభిప్రాయపడుతున్నారు.

click me!