ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై, రాజకీయ నాయకులపై చేస్తూ, అసభ్యకర పోస్ట్ లు పెట్టే వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసిపి సోషల్ మీడియాలో విభాగాల్లో కీలక స్థానంలో అంటూ చంద్రబాబు, పవన్, నారా లోకేష్ లపై వ్యక్తిగతంగా దారుణమైన పోస్ట్ లు చేస్తూ, వారి కుటుంబ సభ్యులని కూడా టార్గెట్ చేసిన వాళ్ళని పోలీసులు వదిలిపెట్టడం లేదు.