* 1979లో వచ్చిన `శంకరాభరణం` సినిమాలోని పాటలన్నీ కర్ణాటక సంగీతాన్ని పోలి ఉన్నాయి. ఎస్పీ బాలు కర్ణాటక సంగీతం నేర్చుకోకపోయినా, `శంకరాభరణం` పాటలు అద్భుతంగా పాడారు. ఈ సినిమాకు ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది.
* రజనీకాంత్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా సీనియర్లనుంచి, ఆ తర్వాత తరం, మూడో తరం, నాల్గో తరం హీరోలకు కూడా ఆయన పాటలు పాడారు. ఎస్పీబీ పాడిన పాటలు చాలావరకు విజయవంతమయ్యాయి.
* గాయని జానకి ద్వారా ఎస్పీబీకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ రకంగా సంగీత ప్రపంచాన్ని ఆయన శాసించారు.