1988లో ధర్మాతిన్ తలైవన్ అనే తమిళ చిత్రంతో ఖుష్బూ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత, ఆమె అనేక దక్షిణ భారత చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందారు. సౌత్ ఇండియాలో గుడి కట్టిన మొదటి నటి ఖుష్బూ సుందర్ కావడం విశేషం. అయితే, వివాహానికి ముందు లైంగిక సంబంధాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, కుష్బూ గుడిని 2005లో కూల్చి వేశారు.