సౌందర్య భర్త ఏమన్నారంటే.?
సౌందర్య మరణం వెనక నటుడు మోహన్ బాబు హస్తం ఉందని వస్తున్న ఆరోపణలకు.. ఆమె భర్త రఘు స్పందించారు. మోహన్బాబుతో తమకెలాంటి ఆస్తిగొడవలు లేవని, సౌందర్య మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆమె ఆస్తిని నటుడు మోహన్బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఆయనతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్బాబును ఎంతో గౌరవిస్తా. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. మాకెలాంటి ఆస్తి గొడవలు లేవు' అంటూ పేర్కొన్నారు.