ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులకు సాయం చేసేందుకు, వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అపర కర్ణుడిగా కీర్తింప బడుతున్న సోనూసూద్ రంగంలోకి దిగాడు. కరోనా సమయంలో సోనూ సూద్ దేశం మొత్తం చేసిన సహాయ కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం, ఆర్థిక సహాయం, ఉద్యోగాలు కల్పించడం, ఆక్సిజెన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు సోనూ సూద్ ఎన్నో చేశారు.