Song: యూట్యూబ్లో తెలంగాణ జానపదాలకు ఎలాంటి ఆదరణ లభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత ఇలాంటి పాటలకు పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతోంది. దీంతో కొన్ని పాటలు యూట్యూబ్లో చరిత్ర సృష్టిస్తున్నాయి.
తెలుగు జానపద సంగీతానికి సోషల్ మీడియాలో భారీ ఆదరణ లభిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా యూట్యూబ్, రీల్స్ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా జానపద గీతాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘రాను బొంబాయికి రాను’ అనే ఫోక్ సాంగ్ ఇప్పుడు తెలుగు జానపద సంగీతంలో చరిత్ర సృష్టించింది. యూట్యూబ్లో ఈ పాట తాజాగా 80 కోట్ల (800 మిలియన్ల) వ్యూస్ దాటింది. ఒక జానపద పాట ఈ స్థాయిలో వ్యూస్ సంపాదించడం అరుదైన ఘనతగా చెప్పాలి. పెళ్లిళ్లు, జాతర్లు, వేడుకలు, రీల్స్, సోషల్ మీడియా వీడియోలు… ఎక్కడ చూసినా ఈ పాట వినిపించడం దీని ప్రాచుర్యానికి నిదర్శనం.
25
ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన జానపద గీతం
తెలంగాణ ఫోక్ స్టైల్లో వచ్చిన ఈ పాట చాలా వేగంగా జనాల్లోకి చేరింది. గ్రామీణ నేపథ్యం, సులభమైన పదాలు, ఆకట్టుకునే ట్యూన్ ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పల్లెటూరి సంస్కృతి ప్రతిబింబించే లిరిక్స్ ఉండటంతో చిన్నవారు నుంచి పెద్దవారివరకు అందరూ ఈ పాటను ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో ఈ పాటకు భారీ స్పందన వచ్చింది. ఇదే కారణంగా యూట్యూబ్లో వ్యూస్ రికార్డు స్థాయికి చేరాయి.
35
16 ఏళ్ల కష్టానికి ఫలితంగా వచ్చిన విజయం
ఈ పాట వెనుక ఉన్న వ్యక్తి రాము రాథోడ్. ఆయన ఒక్కసారిగా వచ్చిన స్టార్ కాదు. దాదాపు 16 సంవత్సరాలుగా జానపద సంగీత రంగంలో శ్రమిస్తున్న కళాకారుడు. ఎన్నో పాటలు రాసినా ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. అయితే ‘రాను బొంబాయికి రాను’ పాట మాత్రం ఆయన కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఈ పాట ఇచ్చిన గుర్తింపుతో ఆయనకు విస్తృతమైన పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా ఈ పాట కారణంగానే ఆయనకు బిగ్బాస్ షోలో పాల్గొనే అవకాశం కూడా లభించిన విషయం తెలిసిందే.
ఇంత పెద్ద రికార్డు సాధించిన ఈ పాటకు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. సుమారు 3 నుంచి 5 లక్షల మధ్య బడ్జెట్తోనే ఈ వీడియో రూపొందింది. పాటకు రాము రాథోడ్ లిరిక్స్ రాశారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రాము రాథోడ్, ప్రభ కలిసి ఈ పాటను ఆలపించారు. వేములవాడ ప్రాంతంలో ప్రధానంగా షూటింగ్ చేశారు. క్లైమాక్స్ సీన్స్ కోసం జగిత్యాలలో మళ్లీ చిత్రీకరణ చేశారు. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన డ్యాన్స్ స్టెప్పులు పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
55
80 కోట్ల వ్యూస్… యూట్యూబ్ ఆదాయం ఎంత ఉండొచ్చు.?
ఈ పాట యూట్యూబ్లో ఇప్పుడు 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. భారతదేశంలో జానపద కంటెంట్కు సాధారణంగా 1000 వ్యూస్కు సుమారు రూ.20 నుంచి రూ.40 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే 800 మిలియన్ల వ్యూస్కు సుమారు రూ.1.6 కోట్ల నుంచి రూ.3.2 కోట్ల వరకు గ్రాస్ రెవెన్యూ రావచ్చు. యూట్యూబ్ వాటా తీసేసిన తర్వాత క్రియేటర్కు అందే మొత్తం సుమారు రూ.90 లక్షల నుంచి రూ.1.8 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. అయితే అసలు ఆదాయం ప్రకటనలు, దేశాల వారీగా వచ్చే CPM ఆధారంగా మారుతుంది.
మొత్తంగా చూస్తే ‘రాను బొంబాయికి రాను’ పాట ఇప్పుడు తెలుగు జానపద సంగీతంలో కొత్త మైలురాయిగా నిలిచింది. 80 కోట్లకు పైగా వ్యూస్ సాధించడం ద్వారా ఈ పాట తెలుగు ఫోక్ సాంగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది.