నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్, నేను అలా అనుకోలేదు.. పిల్లల్ని కనడంపై శోభిత కామెంట్స్

First Published Sep 25, 2024, 9:06 PM IST

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డారు. కొంతకాలం సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన ఆ తర్వాత సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డారు. కొంతకాలం సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన ఆ తర్వాత సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా చైతు, శోభిత జంట సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

వీళ్లిద్దరి పెళ్లి తర్వలో జరగనుంది.. అయితే ఎప్పుడు అనేది ఇంకా అక్కినేని ఫ్యామిలీ ప్రకటించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాల చైతన్యతో ఎంగేజ్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతు, శోభిత నిశ్చితార్థం గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా జరిగిపోయింది అనే కామెంట్స్ ఉన్నాయి. దీనిపై శోభిత స్పందించింది. 

Latest Videos


నా నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది అని నేను అనుకోవడం లేదు. నా ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని నేను కోరుకున్నానో అలాగే జరిగింది. నా నిశ్చితార్థం గ్రాండ్ గా జరగాలని నేను కలలు కనలేదు. సాంప్రదాయాలకు అనుగుణంగా , బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాలని అనుకున్నా. 

నిశ్చితార్థం చాలా ప్రశాంతంగా సూపర్ గా జరిగింది. ఆ విషయంలో నేను హ్యాపీ అని శోభిత తెలిపింది. సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం. అదే విధంగా కుటుంబ సభ్యులని, మన సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తాను. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకునేదాన్ని. మాతృత్వం అంటే తనకి ఎంతో ఇష్టం అని శోభిత పేర్కొంది. 

శోభిత ధూళిపాళ మోడల్ గా రాణించి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. పొన్నియన్ సెల్వం చిత్రంలో కూడా నటించింది. ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి మెప్పించింది. 

click me!